ముట్నూరి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరాడు. ఇక్కడే ఈయనకు [[పట్టాభి సీతారామయ్య]] సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవాడు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. కృష్ణారావుగారు మద్రాసులో ఎఫ్.ఎ చదువుతున్నరోజులలో వంగనాయకుడు [[బిపిన్ చంద్రపాల్]] గారు [[బ్రహ్మ సమాజం]] ఉపన్యాసములు ఇవ్వ్వటానికి [[చెన్నై|మద్రాసు]] విచ్చేసినప్పుడు కృష్ణారావు గారికి ఆయన మీద గురి కుదిరి, ఆయనకి శిష్యులు అయినారు. అటుపై వంగవీరునితో [[బెంగాలు]] వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి [[కలకత్తా]]లో బిపిన్ పాలు, [[అరవింద ఘోష్]], [[ఠాగూర్]] వార్ల పరిచయము వలన వచ్చిన అనుభవముతో 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనాడు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం [[ఆంధ్ర భారతి]] అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించాడు.
 
తరువాతి కాలంలో బందరు ([[మచిలీ పట్నం]]) లో స్థిరపడి ఆంగ్ల భాషలో గొప్ప వక్తగా పేరొందారు. కృష్ణా పత్రిక కార్యాలయంలో వీరి గోష్ఠిని సాహితీ వేత్తలు " దర్బారు"గా వ్యవహరించేవారట. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలంలో చురుకుగా వ్యవగహరించేది. ఆ రోజుల్లో పత్రిక కార్యాలయలంలో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘీకసాంఘిక విషయాలపై పలు చర్చలు జరిగేవట. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీ ముట్నూరి ఒక [[కళ]]<nowiki/>గా, [[తపస్సు]]<nowiki/>గా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణా పత్రికలో వచ్చే వార్తల పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట.
 
==మూలాలు==