నాగర్‌కర్నూల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి 117.212.245.239 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
Added content
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Nagarkurnool District Revenue divisions.png|thumb|నాగర్‌కర్నూల్ జిల్లా]]
'''నాగర్‌కర్నూల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
==నాగర్ కర్నూలు ముఖ్య పాత్రలు==
నాగర్ కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా అన్నికైన వీఎన్ గౌడ్, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి, విమోచనోద్యమకారులు పాపయ్య పర్సా, పెంటమరాజు సుదర్శనరావు, పాలెంను అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, రచయిత పెంటమరాజు నరసింగరావు ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలున్నాయి. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి. మండల కేంద్రం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి.
 
సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున తాడూరు మండలము, తూర్పున టెల్కపల్లి మండలము, దక్షిణాన పెద్దకొత్తపల్లి, గోపాలపేట మండలములు, పశ్చిమాన బిజినేపల్లి మండలము సరిహద్దులుగా ఉన్నాయి.
 
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68538. ఇందులో పురుషులు 34960, మహిళలు 33578.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. ఇందులో పురుషులు 37731, మహిళలు 36961. పట్టణ జనాభా 26759, గ్రామీణ జనాభా 47933. జనాభాలో ఇది జిల్లాలో 9వ స్థానంలో ఉంది.
 
రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి కొల్లాపూర్, కల్వకుర్తి, గోపాలపేట్ లకు కూడా రహదారి సౌకర్యం ఉంది.
 
చరిత్ర:
నాగర్‌కర్నూల్ పూర్వనామం నాగనవోలు. 1883 వరకు ఈ పట్టణం జిల్లా కేంద్రంగా పనిచేసింది. నాగన, కందన సోదరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.వారి పేరిట ఈ పట్టణానికి ప్రస్తుతనామం వచ్చినట్లు కథనం ప్రచారంలో ఉంది.
 
 
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
నాగర్ కర్నూల్ మండల స్థానం (ఎరుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరం మణెమ్మ విజయం సాధించారు.
 
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 54 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 30 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నవి.
 
వ్యవసాయం, నీటిపారుదల:
మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి, వేరుశనగ, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
 
కాలరేఖ:
1972: నాగర్‌కర్నూలులో కొత్త బస్టాండు ప్రారంభమైంది.
1979 మార్చి 10: పుట్టపర్తి సాయిబాబా పట్టణానికి విచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేశారు.
2011: నాగర్‌కర్నూల్‌ను మేజర్ గ్రామపంచాయతి నుంచి పురపాలక సంఘంగా హోదా పెంచబడింది
2016, అక్టోబరు 11 : ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో చేరింది.
 
తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 133 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
== జిల్లా చరిత్ర ==
పూర్వం1870 సం. లో నిజాం ప్రభుత్వం నాగర్ కర్నూల్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది.  అపుడు 8 తాలుకాలు ఉండేవి . 1881 నాటికి వాటి సంఖ్య 10 కి పెరిగింది. 1883 లో జిల్లా కేంద్రాన్ని మహబుూబ్ నగర్ కు బదిలీ చేశారు.