వేంపెంట ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
== పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ==
1999లో వేంపెంటకు కొన్నిమీటర్ల దూరంలో మూడు పవర్ ప్లాంట్లకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉండటంతో పవర్ ప్లాంటు ఏర్పాటు చేయలేదు. వేంపెంట ప్రక్కనే ఉన్న నిప్పుల వాగు మీదుగా 2.4 మెగావాట్ల సామర్థ్యం చొప్పున మూడు పవర్ ప్లాంట్ లను అనుమతి నిస్తూ 2003లో జీ.వో నెం.48,49,50 లను జారీ చేసింది ప్రభుత్వం. 2011లో పవర్ ప్లాంటు నిర్మాణానికి సర్వే మొదలు కావటంతో గ్రాంస్థులలో ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు నిర్మాణం చేపడుతున్న స్థలం గ్రామానికి ప్రక్కనే ఉండటంతో నిర్మాణ సమయంలో ప్రేలుళ్లకు ఇళ్ళు కూలిపోయాయనీ, ప్రేలుడు సమయంలో వెలుపడే రసాయన పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తాయని, ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు కోసం కాలువ లోతుగా త్రవ్వితే భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దాని మూలంగా పంటలు పండవని భావించిన గ్రాంస్థులు 2011 ఆగస్టులో భూమి పూజ చేసేందుకు వెళ్ళిన వారిని అడ్డుకున్నారు. గ్రామాలలో పరిశ్రమ స్థాపించాలంటే గ్రామ పంచాయితీ నిరభ్యంతర పత్రం ఉండాలి. పంచాయితీ తీర్మానం చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఇవేమీ లేకుండానే పవర్ ప్లాంటు పని మొదలైంది. ఊరిని వల్లకాడుగా మార్చేపవర్ ప్లాంటు వద్దంటూ గ్రామస్థులు ఆందోళను దిగారు. హైకోర్టు న్యాయవాదులను ఆశ్రయించారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు పిర్యాదు చేసారు. జాతీయ ఎస్.సి, ఎస్.టి కమీషన్ కు పిర్యాదు చేసారు. నీటిపారుదల, కాలుష్య, అటవీ నివారణ మండలి వంటి అనేక ప్రభుత్వ శాఖలకు పిర్యాదు చేసారు. జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామస్థుల పిర్యాదుతో ఎస్.సి.,ఎస్.టి కమీషన్ విచారణ చేపట్టింది. బాధిత గ్రామస్థులు డిల్లీకి పోయి ఎస్.సి.,ఎస్.టి కమీషన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏళ్లతరబడి ఈ ఉద్యమం కొనసాగింది. గ్రామం లోని మహిళలు ఊరి బయటి ఉన్న చెట్ల క్రింద కూర్చుని దీక్ష చేపట్టారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అకృత్యాలను భరించారు. అనేక కష్టాలను భరించారు. చివరకు విజయం సాధించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేంపెంట_ఉద్యమం" నుండి వెలికితీశారు