వేంపెంట ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ మూలం
పంక్తి 13:
ఈ గ్రామంలో ఉద్యమం కొనసాగుతుండగానే 2015లో పోలీసు బందోబస్తుతో పనులు ప్రారంభించారు. గ్రామస్థులు భయపడినట్టుగానే ప్రేలుళ్లకు ఇళ్ళు బీటలు వారాయి. దీనితో గ్రామస్థులలో తిరుగుబాటుమొదలైంది .పోలీసులను ఎదిరించారు. పవర్ ప్లాంటు నిర్మాణం కోసం వచ్చే సిబ్బందిని కర్రలతో తరిమి కొట్టారు. 2015 మార్చి 15న ఈ గ్రామంలో దీక్ష చేపట్టారు. గ్రామ నిధి నుండి ఉద్యమానికి అవసరమైన ఖర్చు చేసారు. కొన్నాళ్ళు గ్రామమంతా ఐక్యంగా ఉన్నా తరువాత కొంతమంది ఉద్యమం నుండి తప్పుకున్నారు. ఐనాసరే వారి పట్టు సడలలేదు. ఏడాది గడిచినా దీక్ష కొనసాగించారు. ఇళ్ళు గడవాలంటే మగవారు పనులకు వెళ్లాల్సి వచ్చింది. మహిళలో నిరంతరం దీక్షలో పాల్గొన్నారు. ప్రతీరోజూ దీక్షలో పాల్గొన్నవారికి దండలు వేయడానికి, సాయంత్రం నిమ్మరసం ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. షామియానాలు కూడా లేవు. చెట్ల క్రింద బండరాళ్లపై అట్టలు పట్టుకుని కూర్చున్నారు. ప్రక్కన ఉన్న పిట్టగోడపై దీక్ష ఎన్నిరోజులకు చేరిందో రాస్తూ వచ్చారు. ఈ దీక్షను భగ్నం చేసేందుకు ఎన్నో విధాల ప్రయత్నాలు జగిగాయి. ఉద్యమానికి నాయకత్వం వహించే వారికి డబ్బు ఆశ కూడా చూపించారు. కానీ వారు ప్రలోభాలకు లోను కాకుండా దీక్షను కొనసాగించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి పర్యటనకు రావడంతో అతనికి వినతి పత్రాన్నిచ్చారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినపుడు వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వస్తే అనుమతులు రద్దు చేస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చాడు. రాహుల్ గాంధీ పుట్టపర్తికి వస్తే అతనిని కూడా కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. మేథాపాట్కర్ విజయవాడకు వస్తే ఆమెను కలసి వినతి పత్రాన్నిచ్చారు. ఉద్యమానికి అవసరమైమ ఖర్చు సుమారు 20 లక్షల రూపాయలు గ్రామస్థులు చందాలు వేసుకుని భరించారు.
 
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కలెక్టర్ల సమావేశంలో కర్నూలు కలెక్టరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే జగన్ స్పందించి ఆ అనుమతులు రద్దుసేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టరు వీరపాండ్యన్ కు దీక్ష వద్దకు పంపి దీక్ష విరమింపజేయవలసినదిగా కోరాడు. అప్పటికి దీక్ష 1567 రోజులకు చేరింది. 1568వ రోజు కలెక్టరు ఆ ప్రాంతాన్ని సందర్శించి దీక్ష విరమిచాల్సినదిగా కోరాడు. జీ.వో జారీ చేసేంతవరకు దీక్ష విరమించేది లేదని గ్రామస్థులు చెప్పడంతో వారికి జీ.వో గూర్చి హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/AndhraPradesh/2151054|title=త్వరలో వేంపెంట పవర్‌ ప్లాంట్‌ రద్దు {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2019-07-12}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేంపెంట_ఉద్యమం" నుండి వెలికితీశారు