తిరుమల సుప్రభాత సేవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా [[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం|సుప్రభాతాన్ని]] ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన [[పాలు]], [[చక్కెర]], [[వెన్న]], [[తాంబూలము|తాంబూలం]] గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. వీరితోపాటు [[తాళ్ళపాక అన్నమయ్య]] వంశీయు లొకరు అన్నమయ్య కీర్తన నొకదానిని ఆలపిస్తూండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన [[మండపం]]<nowiki/>లో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా [[పాలు]] (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కను అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు మొదలైన వాళ్ళు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారిని [[విశ్వరూపం|విశ్వరూప]] దర్శనం చేసుకుంటారు.
 
ముందురొజు రాత్రి బ్రహ్మ డు స్వామీని అర్చించి వెళ్ళంళినవెతాడని భక్తుల తరువాతనమ్మకం.
 
సుప్రభాత సేవ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు సేవలో పాల్గొనవచ్చు.