భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
[[దస్త్రం:Flag of India.svg|250px|thumb|భారత జాతీయపతాకం జండా నిష్పత్తి: 2:3]]
 
'''భారత జాతీయ పతాకం''' అన్నది దీర్ఘ చతురస్రాకారంలో [[కాషాయం]], [[తెలుపు]], [[ఆకుపచ్చ|పచ్చ]] రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన [[అశోకచక్రం|అశోక చక్రం]]<nowiki/>తో ఉంటుంది. 1947 జూలై 22న [[భారత రాజ్యాంగ పరిషత్]] సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న [[భారత డొమినియన్|భారత డొమినియన్‌]]<nowiki/>కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ [[భారత దేశం|భారత గణతంత్రానికి]] అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో ''తిరంగా'' ({{lang-hi|तिरंगा|translit='''Tiraṅgā'''<!-- THIS Hindi SPELLING IS CORRECT: PLEASE SEE [[Wikipedia:Enabling complex text support for Indic scripts]] -->}}) లేక ''ట్రైకలర్'' ({{Lang-en|Tri-color}}) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. [[పింగళి వెంకయ్య]] రూపకల్పన చేయగా<ref name="PV" group="నోట్స్">ప్రస్తుత పతాకం పింగళి వెంకయ్య ఒరిజినల్ డిజైన్ నుంచి రూపొందించారు, కానీ అతని పేరునే సాధారణంగా జెండా రూపకర్తగా వ్యవహరిస్తారు.</ref> 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న [[భారత జాతీయ కాంగ్రెస్]] పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.
 
చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా [[మహాత్మా గాంధీ]] ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌కే హక్కు ఉంది. ఈ కమీషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.
 
భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ [[భారత స్వాతంత్ర్య దినోత్సవం]], [[గణతంత్ర దినోత్సవం]] వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది.
 
== ప్రతీక ==
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు