తంగిరాల వెంకట సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు రచయిత
కొత్త పేజీ: తంగిరాల వెంకట సుబ్బారావు గారు 30.3.1935 న జన్మించారు. శ్రీ వేంకటేశ్వ...
(తేడా లేదు)

19:50, 21 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

తంగిరాల వెంకట సుబ్బారావు గారు 30.3.1935 న జన్మించారు. శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పింగళి లక్ష్మి కాంతం, ఆచార్య జి.యన్. రెడ్డి గార్ల పర్యవేక్షణలో "తెలుగు వీరగాథా కవిత్వము" అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులుగా పనిచేసిన వీరు అనేక గ్రంథాలు రచించారు. హంసపదిక, వనదేవత, గుండెపూచిన గులాబి వంటి సృజనాత్మక రచనలు , జానపదసాహిత్యము-వీరగాథలు, కాటమరాజు కథలు, తెలుగు వీరగాథా కవిత్వము, అంకమ్మ కథలు, శ్రీకృష్ణ కర్ణామృతము, రేనాటి సూర్యచంద్రులు ( మొదటి, రెండవ సంపుటాలు) వంటి పరిశోధనాత్మక గ్రంథాలను వెలయించారు. తెలుగులోనే కాకుండా కన్నడంలో " వేమన- ఎరడు అద్యయనగళు, విశ్వనాథ సత్యనారాయణ, హిమవద్ గోపాలస్వామి వంటి రచనలు చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి తంగిరాల వారు. శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య: 11.4.1994 న శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య అనే సాహిత్య సంస్థను ప్రారంభించి ప్రతి నెలా ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా 150 ప్రసంగాలు, 50 గోష్ఠులు నిర్వహించారు. తెలుగు ప్రాచీన సాహిత్యం గురించి, ఆధునిక సాహిత్యం గురించి, జానపద సాహిత్యం గురించి ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి తెలుగు సాహిత్య, భాషా వికాసానికి కృషి చేస్తున్న తంగిరాల వారు రేనాటి సూర్యచంద్రులను గురించి చేసిన పరిశోధన విశిష్ఠమైనది.