కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దురద్దుఅయింది చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. ఆర్టికల్ 370ఎ జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే.. ఆర్టికల్ 35-A అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది.జమ్మూ కాశ్మీర్ ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలు అయింది.జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ మూడూ మూడు భాగాలుగా చెలామణీలోకి వస్తాయి. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ మాత్రం అసెంబ్లీని కూడా కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెలామణీ అవుతాయి.అదే సమయంలో లడాఖ్.. కేవలం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉండే, అసెంబ్లీ లేని ప్రాంతంగా ఉంటుంది