తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 217:
[[File:Suravaram Pratapareddy.jpg|thumb|right|170px|<center>తెలంగాణ వైతాళికుడు [[సురవరం ప్రతాపరెడ్డి]]</center>]]
ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. [[ఆలంపూర్|ఆలంపూర్‌కు]] చెందిన మంథాన భైరవుడు 10వశతాబ్దంలోనే ప్రసిద్ధ "భైరవతంత్రం"అనే సంస్కృత గ్రంథం రచించాడు.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు</ref> 13వ శతాబ్దిలో [[గోన బుద్ధారెడ్డి]] "రంగనాథ రామాయణం" ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి [[కుప్పాంబిక]] తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి [[భూత్పూరు (గ్రామం)|భూత్పూర్‌లోని]] దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో [[కాకతీయులు|కాకతీయ యుగం]] స్వర్ణయుగంగా భావించబడుతుంది. [[గణపతి దేవుడు|గణపతిదేవుని]] బావమరిది [[జాయపసేనాని]] [[నృత్యరత్నావళి]]ని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన [[పాల్కుర్కి సోమనాథుడు]] తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: [[సుంకిరెడ్డి నారాయణరెడ్డి]], పేజీ 139</ref> వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన [[బద్దెన]] కాకతీయుల కాలంలో [[సుమతీ శతకము]] రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి [[మారన]] ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి [[విద్యానాథుడు]] రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన [[శివదేవయ్య]] కూడా మహాకవి. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్కార చంద్రిక రచించిన [[విశ్వేశ్వరుడు]] కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత [[సర్వజ్ఞ సింగభూపాలుడు]] కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 167</ref> తొలి తెలుగు వచనకర్త [[కృష్ణమాచార్యులు]] కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్ కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు. చిత్రవిచిత్రాలతో కూడిన "చిత్రభారతం" రచయిత [[చరిగొండ ధర్మన్న]] 15-16వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి.
[[దస్త్రం:CNREDDYC.JPGnarayanareddy.jpg|thumb|left|170px|<center>జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]</center>]]
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ [[మరింగంటి సింగరాచార్యులు]] తన కవిత్వంతో [[ఇబ్రహీం కుతుబ్‌షా]]నే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి [[అద్దంకి గంగాధరుడు]] ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. [[పొన్నెగంటి తెలగనాచార్యుడు]] 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. [[కులీకుతుబ్‌షా]] సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసె సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర" రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి [[ఎలకూచి బాలసరస్వతి]] తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే [[కాకునూరి అప్పకవి]] తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. [[తానీషా]] వద్ద పనిచేసే [[అక్కన్న-మాదన్న]]ల మేనల్లుడు [[కంచెర్ల గోపన్న]] (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే.
[[దస్త్రం:Kaloji-1.jpg|thumb|right|160px|<center>తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ</center>]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు