భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|500px|right|thumb|తెలుగులిపిపరిణామ క్రమంలో భట్టిప్రోలు లిపి]]
తెలుగు లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశమందలి తెలుగునాడులో కృష్ణానదీమైదానంలో సముద్రతీరానికి సమీపములో గల గ్రామము [[భట్టిప్రోలు]]లో లభించిన బౌద్ధస్థూపము వలన తెలుస్తున్నది.
 
==చరిత్ర==
ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు భట్టిప్రోలుకు నామాంతరాలని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ. శ. 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని వ్రాసిన 'ధర్మామృత' కావ్యములో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. ఇది క్రీ. పూ. 5వ శతాబ్దిలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన [[యశోధరుడు]] దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఈతని వారసుడు ధనదుడు జైన మతము వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథే బృహత్కథాకోశములో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి [[చందోలు]] అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో 'కుబీరక' రాజు ప్రసక్తి ఉంది. కుభీరక, కుబేర ధనదుడి నామాంతరాలు. జైనరాజగు [[ఖారవేలుడు]] పితుడ్రనగరం బౌద్ధక్షేత్రాన్ని [[గాడిద]]లతో దున్నించి నాశనం చేశాడని ఖారవేలుని శాసనాలలో చెప్పబడింది. ఆ శాసనాలలోని పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref>సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి మొదటి భాగం - [[ముప్పాళ్ళ హనుమంతరావు]] పేజీ.417 ఏ.బి.ఎస్.పబ్లిషర్స్ రాజమండ్రి</ref>
 
==బౌద్ధస్తూపము==
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు