భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==చరిత్ర==
క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడేవారు. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకునేందుకు రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాలు వలన తెలుస్తున్నది. . ప్రాకృత – సంస్కృత ప్రభావంతో అనేక పదాలు తెలింగభాషలో చేరి బౌద్ధ సంపర్కంతో అంధక, లేక ఆంధ్రీ అనబడిన ఆంధ్రభాష బలపడింది. ఎన్ని మార్పులు వచ్చినా అజంతత్వాన్ని వదులుకోలేదు. అంటే ‘వనం’ అనే సంస్కృత పదాన్ని ‘వనము’ అని అజంతంగా వ్రాయటం సాహిత్యానికి, సంగీతానికి అనువైన భాషగా అయ్యింది.<ref name=pvp>{{Cite web |title=తెలుగు భాషా ప్రాచీనత |author= పి. వి. పరబ్రహ్మశాస్త్రి|url=https://eemaata.com/em/issues/201705/11470.html |archiveurl=https://web.archive.org/web/20170617035901/https://eemaata.com/em/issues/201705/11470.html |archivedate= 2017-06-17}}</ref>
 
==లిపి==
పంక్తి 10:
 
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. <ref name="bas">{{Cite book |title=భట్టిప్రోలు మహాస్తూపము, |author= భట్టిప్రోలు ఆంజనేయ శర్మ, |date=2007|publisher=భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.}}</ref>
భట్టిప్రోలు స్తూపంలో దొరికిన స్పటికపు బరిణెల మీదనున్న అక్షరాలలో కొన్ని అచ్చతెలుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. వాటిలో ఇప్పటి తెలుగు ‘ళ’ అక్షరం భట్టిప్రోలు అక్షరానికి పరిణామమే. అలాగే ద అనే అక్షరము. హల్లుల పైన ఉండే తలకట్టుకు మూలమైన గీత భట్టిప్రోలు శాసనం నాటి లిపిలో కనబడుతుంది.<ref name=pvp />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు