అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చి cp
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
==పురాతన స్తూపం వెలుగు చూసిన విధం==
క్రీ.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్ (1845), రాబర్ట్ సెవెల్ (1877), జేమ్స్ బర్జెస్ (1881), అలెగ్జాండర్ రె (1888-1909), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1958-59), యం. వెంకటరామయ్య (1962-65), [[ఇంగువ కార్తికేయశర్మ|ఐ. కార్తికేయ శర్మ]] (1973-74) మున్నగు పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిథిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది<ref>{{Cite web |title=Amaravathi Stupa (Interactive exploration) |url=http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archiveurl=https://web.archive.org/web/20030807181627/http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archivedate=2003-08-07}}</ref>.
 
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో [[అమరావతి స్తూపం|అమరావతి స్తూపం]] సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్తూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు.
 
==మహాచైత్యము నిర్మాణ దశలు==
Line 183 ⟶ 181:
 
==క్షీణత==
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో [[అమరావతి స్తూపం|అమరావతి స్తూపం]] సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు ఇక్కడ పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్తూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు. ఈ స్తూపం కోల్పోయిన వైభవం గురించి సుప్రసిద్ధ చరిత్ర కారుడు [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]] ఇలా వ్రాశాడు<ref name="MSS"/>.
:అచిర కాలముననే ధాన్యకటకమునకా మహా దశ తొలగిపోయినది. మహాచైత్యము ప్రభ క్రీ.శ. నాలుగైదు శతాబ్దులవరకు వెలిగినది. బ్రాహ్మణ మతాభిమానులయిన పల్లవులు, చాళుక్యులు, వాకాటకులు వంటి రాజుల కాలంలో ఆశ్రయమొసగి పోషించేవారు లేక దక్షిణాపధంలో బౌద్ధము క్రమముగా క్షీణ దశకు వచ్చెను. క్రీ.శ. 7వ శతాబ్దిలో చీనా యాత్రికుడయిన యువాన్ చువాంగ్ ధాన్యకటకమును సందర్శించునాటికే బౌద్ధము దుర్దశలోనున్నది. బౌద్ధవిహారములనేకములు భిక్షుసంఘ పరిత్యక్తములయి, జన శూన్యములయి పాడువారి యుండినవి. ఇరువది విహారములందు మాత్రము బౌద్ధ సాంఘికులు నివశించుచుండిరి. వారయినను వేయిమందికెక్కువ లేరు. అప్పటికి హిందూ దేవాలయములనేకములు ప్రతిష్ఠితములయినవి. అయినను ఆ మహానగరమునకు విద్యాపీఠమను యశస్సు కుంచితము కాలేదు.
 
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు