మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎కథ: True story
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
1909లో ఉదయ్ పూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ సింగ్ ([[శరత్ బాబు]]) కుమార్తె మిత్రవింద దేవి (తర్వాతి జన్మలో ఇందు), ఆ రాజ్యసైన్యంలో ముఖ్యవీరుడు, సైనికులకు శిక్షణనిచ్చేవాడూ అయిన కాలభైరవ (హర్ష పూర్వజన్మ)ని ప్రేమిస్తుంది, కానీ కాలభైరవ తనకిష్టమన్నది చెప్పకుండా నిగ్రహించుకుంటాడు. అలానే కాలభైరవ వందమందిని చంపిగానీ చావనివారూ, రాజ్యం కోసం పోరాడుతూ 30ఏళ్ళలోపే మరణించేవారూ అయిన యోధులు కల శతధ్రువంశ యోధుడు. అతనికీ ఆ వీరత్వం, పోరాటతత్త్వం వస్తాయి. ఆమెని మోహించి ఆమెనీ, రాజ్యసింహాసనాన్ని అధిష్టించాలనుకునే రాజు మేనల్లుడు రణదేవ్ భిల్లా (రఘువీర్ గతజన్మ) ఆమె కాలభైరవకు సన్నిహితం కావడాన్ని సహించలేకపోతాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు, హిందుస్తాన్ కి ఏకైక సామ్రాట్టు అయ్యేందుకు [[ఢిల్లీ]]ని ఏలుతున్న [[షేర్ ఖాన్]] రాజ్యం వెలుపల లక్షలాది సైనికులతో మోహరిస్తాడు. అతని కాలభైరవని రాజ్యబహిష్కారం చేయించేందుకు ఓ పన్నాగం పన్నుతాడు. దాని ప్రకారం ఎప్పుడూ జరిగే రాజ్యంలోని అత్యుత్తమ వీరుడు పోటీని మార్చి తనకూ, భైరవకూ మధ్య మరో పోటీ ఏర్పాటుచేయిస్తాడు. మిత్రవిందాదేవి వస్త్రశకలాన్ని తీసి, గుర్రాల రథంపైకి విసరుతాడు. ఆ గుర్రాలు వేగం పుంజుకుని వెళ్ళిపోయాకా ఎవరైతే ముందుగా ఆ వస్త్రంతో నగరంలోకి అడుగుపెడతారో వారికి మిత్రవిందాదేవితో వివాహం, రాజ్యం దక్కాలని, ఓడినవారు రాజ్యం వదిలిపోవాలని ప్రతిపాదిస్తాడు. ఆవేశంలో ఉన్న మిత్రవింద అందుకు అంగీకారం తెలుపుతుంది. భైరవను ఎన్నోరకాలుగా మోసం చేసి, సైనికులను పెట్టి చంపి ఓడించాలనుకున్నా వారందరినీ చిత్తుచేస్తాడు. గుర్రాలున్న రథం ఊబిలోకి దిగుతూంటే గుర్రాల ప్రాణాలు కాపాడేందుకు తానూ ఊబిలోకి దిగి కాపాడి తన గుర్రం సాయంతో బయటపడతాడు. ఈ అవకాశం తీసుకుని వస్త్రంతో వెళ్తూన్న రణదేవ్ నుంచి వస్త్రాన్ని చివరి నిమిషింలో లాక్కుని ముందుగా నగరంలోకి ప్రవేశించి విజయం సాధిస్తాడు. దాంతో మిత్రవింద పిలుపును అందుకుని ఓడిపోయిన రణదేవ్ ను జనమంతా తరిమేస్తారు. అయితే విక్రమ్ సింగ్ మాత్రం రహస్యంగా వారి వివాహం జరగకూడదనుకుంటాడు. 30 వయసులోపలే రాజును కాపాడేందుకు ఆ వంశస్తులు మరణిస్తారని, అలా కాలభైరవ మరణించి కూతురు వైధవ్యం అనుభవించకూడదని ఆయన అభిమతం. ఈ విషయం తెలిసి మొదట షాక్ అయినా, వెంటనే భైరవ రాజు కోర్కె మన్నించి, అందరి ముందూ రాకుమారి గౌరవాన్ని కాపాడేందుకే ఈ పోటీలో పాల్గొన్నాను తప్ప ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తానెప్పటికీ సింహాసనానికి బద్ధుడైన సైనికుణ్ణే అని ప్రకటిస్తాడు.
 
ఖగోళంలో ఏర్పడనున్న అష్టగ్రహకూటమి రాజ్యానికీ, రాకుమారికి అరిష్టమని జ్యోతిష్కులు చెప్తారు. ఈ దోషం తగ్గడానికి భైరవకోనలోని దేవతాప్రతిమను రాకుమారి మిత్ర పూజించాలని సూచిస్తారు. దీనికి తగ్గట్టు షేర్ ఖాన్ రాజ్యసరిహద్దుల్లో అపారమైన సైన్యంతో పొచివున్న సంగతి మంత్రి చెప్తారు.
వెంటనే పూజ కి సిద్దం కమ్మని రాజు మిత్రవిందని భైరవ ని ఆదేశిస్తాడు వారు పల్లకిలో భైరవ లోనికి వెళతారు. అక్కడ రాజ గురువు మిత్రవిందని ఎనిమిది రంగులతో కాలభైరవుడు కి పూజ చేయమని చెప్తాడు
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/మగధీర_(సినిమా)" నుండి వెలికితీశారు