మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 206:
సామ్రాజ్యం కేంద్రమైన మగధ బౌద్ధమతానికి కూడా జన్మస్థలంగా ఉంది. అశోకుడు మొదట్లో హిందూ మతాన్ని అభ్యసించాడు కాని తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు; కళింగ యుద్ధం తరువాత, ఆయన విస్తరణ వాదం, తీవ్రమైన వేగంతో ఇంటెన్సివు పోలీసింగు, పన్ను వసూలు కొరకు, తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా క్రూరమైన చర్యలు, కఠినమైన ఆర్ధిక నిషేధాలను త్యజించాడు. అశోకుడు తన కుమారుడు మహీంద, కుమార్తె సంఘమిత్ర నేతృత్వంలోని ఒక మతప్రచారక బృందాన్ని శ్రీలంకకు పంపాడు. శ్రీలంక రాజు టిస్సా బౌద్ధ ఆదర్శాలకు ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అతను వాటిని స్వయంగా స్వీకరించి బౌద్ధమతాన్ని దేశజాతీయ మతంగా మార్చాడు. అశోకుడు పశ్చిమ ఆసియా, గ్రీసు ఆగ్నేయాసియాకు అనేక బౌద్ధ మతప్రచారక బృందాలను పంపాడు. మఠాలు, పాఠశాలల నిర్మాణంతో పాటు సామ్రాజ్యం అంతటా బౌద్ధ సాహిత్యాన్ని ప్రచురించాడు. ఆయన సాంచి, మహాబోధి ఆలయం వంటి భారతదేశం అంతటా 84,000 స్థూపాలను నిర్మించాడని నమ్ముతారు. సైబీరియాతో సహా ఆఫ్ఘనిస్తాను, థాయిలాండు, ఉత్తర ఆసియాలో బౌద్ధమతానికి ప్రజాదరణను భివృద్ధి చేసాడు. బౌద్ధ మతం సంస్కరణ, విస్తరణకు కృషి చేసిన కౌన్సిలు, భారతదేశం మూడవ బౌద్ధ మండలి, దక్షిణ ఆసియా బౌద్ధ ఆదేశాలను తన రాజధాని సమీపంలో ఏర్పాటు చేయడానికి అశోకుడు సహాయం చేశాడు. భారతీయ వ్యాపారులు బౌద్ధమతాన్ని స్వీకరించి మౌర్య సామ్రాజ్యం అంతటా మతాన్ని వ్యాప్తి చేయడంలో పెద్ద పాత్ర పోషించారు.<ref>Jerry Bentley, ''Old World Encounters: Cross-Cultural Contacts in Pre-Modern Times'' (New York: Oxford University Press), 46</ref>
==నిర్మాణ అవశేషాలు==
[[File:Barabar Caves 2.JPG|thumb|upright=1.2|Mauryan architecture in the [[Barabar Caves]]. [[Lomas Rishi Cave]]. 3rd century BCE.]]
ఈ కాలపు గొప్ప స్మారక చిహ్నం, కుమ్రారు ప్రదేశంలో ఉన్న పాత రాజభవనం చంద్రగుప్త మౌర్యుని పాలనలో నిర్మించబడింది. సమీపంలోని కుమ్రారు స్థలంలో జరిపిన త్రవ్వకాల్లో రాజభవనం అవశేషాలు వెలికి తీయబడ్డాయి. ఈ రాజభవనం భవనాల సముదాయంగా భావించబడుతుంది. వీటిలో ముఖ్యమైనది విస్తారమైన కొయ్య స్థంభాల మద్దతుతో నిర్మించిన విస్తారమైన సభామంటపం ఉంది. స్తంభాలను సాధారణ వరుసలలో అమర్చారు. తద్వారా హాలును అనేక చిన్న చదరపు మండపాలుగా విభజించారు. స్తంభాల సంఖ్య 80, ఒక్కొక్కటి 7 మీటర్లు. మెగాస్టీనెసు వంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ ప్యాలెసు ప్రధానంగా కలపతో నిర్మించబడింది. ఈ రాజభవనం సుసా, ఎక్బాటానా రాజభవనాలను శోభ, గొప్పతనాన్ని మించిందని భావించారు. దాని పూతపూసిన స్తంభాలు బంగారు తీగలు, వెండి పక్షులతో అలంకరించబడ్డాయి. ఈ భవనాలు చేపల చెరువులతో నిండిన విస్తారమైన ఉద్యానవనంలో ఉన్నాయి. అనేక రకాల అలంకారమైన చెట్లు, పొదలతో అమర్చబడి ఉన్నాయి.<ref>"L'age d'or de l'Inde Classique", p23</ref>{{better source|date=August 2016}} కౌటిల్య అర్థశాస్త్రం ఈ కాలం నుండి ప్యాలెసు నిర్మాణ పద్ధతిని కూడా ఇస్తుంది. రాతి స్తంభాల శకలాలు, వాటి గుండ్రని ఆకృతి, మృదువైన మెరుగుతో సహా, అంతకుముందు చెక్కతో స్థంభాల స్థానంలో రాతి స్తంభాలను నిర్మాణానికి అశోకుడు బాధ్యత వహించినట్లు సూచిస్తుంది.{{citation needed|date=August 2016}}
[[File:Early stupa 6 meters in diameter with fallen umbrella on side in Chakpat near Chakdara.jpg|thumb|left|An early [[stupa]], 6 meters in diameter, with fallen umbrella on side. Chakpat, near [[Chakdara]]. Probably Maurya, 3rd century BCE.]]
|