మాధవరం (తాడేపల్లిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 1:
'''మాధవరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[తాడేపల్లిగూడెం]] మండలం|తాడేపల్లిగూడెం మండలానికి]] చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. దీనికి '''మిలట్రీ మాధవరం''' అని కూడా పేరు. ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. [[రెండో ప్రపంచ యుద్ధం]]లో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. వారి స్మారకార్థం గ్రామంలోని చెరువు గట్టున ఓ స్మారకస్థూపం కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణతో ఈ గ్రామం నుంచి అనేక మంది అనేక దేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. మంచి విలువలు కలిగిన విద్యా వ్యవస్థ ఈ గ్రామానికి మణిహారం. జూనియర్ కాలేజి వరకు ఇక్కడ విద్యా సౌకర్యాలున్నాయి.
== మాధవరం చరిత్ర ==
17వ శతాబ్దంలో ఈ గ్రామం ఏర్పడినట్టుగ ఆధారాలు ఉన్నాయి. అప్పటి [[ఒడిషా]], [[డెక్కన్]] ప్రాంతాలను పరిపాలించే గజపతి వంశానికి చెందినా పూసపాటి మాధవ వర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు 6 కీ.మీ దూరంలో ఉన్న [[అరుగొలను]] గ్రామంలో ఒక కోటను నిర్మించి, ఉత్తర ఆంధ్ర నుంచి సేన్యాన్ని ఇక్కడుకు రప్పించి వారికీ సాగు భూమి మరియు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అరుగొలను గ్రామంలో ఇప్పటికి ఆ కోట శిథిలాలు ఉన్నాయి. ఈ సైనికులు మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుండి ఈ గ్రామంలోని వాళ్ళు అందరు సైన్యంలో చేరుతూ వచ్చారు. తరతరాలుగ దేశరక్షణ తమ ధ్యేయం జీవిస్తున్నారు. [[బ్రిటిష్]] పరిపాలనలో భారతదేశం తరుపున మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు రెండువేల మంది పాల్గొన్నారు.<ref>http://www.hindu.com/2011/01/27/stories/2011012754320700.htm</ref><ref>http://www.caravanmagazine.in/lede/madhavarams-military-men-0</ref><ref>https://www.youtube.com/watch?v=3M2ceN7Cjb8</ref>