నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
=== శృంగేరి శంకరమఠం ===
స్థానిక ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో పూర్వపు రైలుగేటుకు ముందు ఎడమవైపున ఉంది.దీనిని పట్టణంలో నడయాడిన శృంగేరి పీఠాధిపతి [[భారతీ తీర్థ మహాస్వామి|భారతీతీర్థ మహాస్వామిచే]] నిర్మించబడింది.అభినవ విద్యాతీర్థ మహాస్వామిజీ, భారతి తీర్థ మహాస్వామి ఆశీర్వాదాలతో, 1985 ఆగస్టు 25 న అప్పటి టిటిడి చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు ఆలయ సముదాయానికి పునాదిరాయి వేశారు.<ref>{{Cite web|url=https://www.sringeri.net/branches/andhra-pradesh/narasaraopet|title=Narasaraopet|website=Sringeri Sharada Peetham|language=en|access-date=2019-09-25}}</ref>శంకరమఠం ప్రారంభ ఉత్సవాలు 1989 మే 17 నుండి 21 వరకు ఐదు  రోజులపాటు జరిగాయి.కార్యక్రమాలు ఐదు రోజులపాటు నిర్విరామంగా జరగటానికి పర్వేక్షణకుగాను శృంగేరి,బెంగుళూరు,మద్రాసు,బొంబాయి,హైదరాబాదు పట్టణాల నుండి 500 మంది శృంగేరిపీఠం శిష్యగణం తరలివచ్చి వివిద కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,,కుంభాభిషేక మహోత్సవం, హోమగుండం కార్యక్రమాలు సకాలంలో చివరిరోజు 21వ తేది ఆదివారం భారతీతీర్ధ మహాస్వామి చేతులమీదుగా జరిగాయి.<ref>నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి</ref>ఈ సందర్బంగా భారతీతీర్ధ మహాస్వామి భక్తులను ఉద్దేశించి ప్రియభాషణ చేస్తూ ఆదిశంకరుల కోరికమేరకు శృంగేరిలో వెలసిన శ్రీ శారదాదేవి నరసరావుపేట భక్తజనుల అభీష్ఠం నేరవేరుస్తుందని చెప్పాడు. నరసరావుపేటకు చెందిన లంకా రామనాధం సోదరులు, మిన్నెకల్లుకు చెందిన కేతినేని వీరబ్రహ్మంలు శంకర మఠం నిర్మాణానికి భూదానం చేశారు.
 
=== శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం ===
 
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు