వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →బాల్యం |
|||
పంక్తి 40:
ఈయనకు [[వెంట్రిలాక్విజం]] మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో [[బాంబే]] (ప్రస్తుతం [[ముంబై]]) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటి సారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి [[భువనగిరి]]లో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే [[ఎలిమినేటి మాధవ రెడ్డి]] కూడా వేణుమాధవ్ ను [[నల్గొండ]] పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన [[చంద్రబాబు నాయుడు]] చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో [[తెలుగుదేశం పార్టీ]] చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి [[చంద్రబాబు నాయుడు]] వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.<ref>{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |publisher=డి.జి. భవాని |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 September 2019 |language=te}}</ref>
ఆ పరిచయంతో వేణుకు [[హిమాయత్నగర్]] లోని [[తెలుగుదేశం పార్టీ]] కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణు హిమాయత్నగర్లోని టీడీపీ ఆఫీసులో చేరారు. అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చారు.
==సినీ ప్రస్థానం==
|