కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వ్యాసం విస్తరణ,మూలాలు కూర్పు
పంక్తి 1:
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోట|alt=|220x220px]]
[[కొండవీడు|'''కొండవీడు కోట]]''', [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]],[[యడ్లపాడు]] మండలంలోని [[కొండవీడు]] గ్రామ పరిధిలోనిపరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది.రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ.పూ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/travel/kondaveedu-fort-turns-tourist-hotspot-in-ap/articleshow/65337478.cms|title=రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీక.. 'కొండవీడు కోట'!|date=2018-08-09|website=Samayam Telugu|language=te|access-date=2019-10-20}}</ref>
 
==చరిత్ర==
[[దస్త్రం:Kondavid-drug. Signed 'W.R.'.jpg|thumb|220x220px|కొండవీడు కోట ఆయిల్ పెయింటింగ్ చిత్రం.|alt=]]
ఇక్కడవున్న దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు కూడా వున్నాయి.
 
==కోట చరిత్ర==
ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ.పూ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు.ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ.పూ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి  రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది. అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది.ఆ తరువాత  అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి సా.శ.పూ.1364 నుండి 1386 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం అనపోతారెడ్డ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి సా.శ.పూ. 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు విస్తరించాడు. ఆ తరువాత అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సా.స.పూ 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది.ఇతని పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్దపీటవేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా ఇతని పరిపాలనాకాలాన్ని  స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది.సా.శ.పూ 1420 నుండి  1424 వరకు చివరివాడైన  రాచ వేమారెడ్డి పరిపాలించాడు.ఇతను అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=375288|title=కొండవీడు కోట చూసొద్దాం రండి...|date=2017-02-27|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-10-20}}</ref>[[దస్త్రం:Kondavid-drug. Signed 'W.R.'.jpg|thumb|220x220px|కొండవీడు కోట ఆయిల్ పెయింటింగ్ చిత్రం.|alt=]]
===కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు ===
ఇప్పటి వరకు దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్నవాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు సర్కిల్‌ అటవీశాఖ అధికారి అనూప్‌సింగ్‌ సతీమణి రుచిసింగ్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె.వి.రావుతో కలసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.స్థూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు.
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు