ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''పెరియార్ రామస్వామి నాయకర్''' పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ లోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
 
ఈయన ఒక నాస్తిక వాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]] లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. ఈయన దక్షిణ భారతీయులను రాక్షసులుగా,వానరులుగా చిత్రీకరించిన [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పటినుండి హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు.
 
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు.తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ స్వాతంత్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో [[రాజగోపాలచారి|రాజాజీ]] నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం [[హింది]] భాషను తమిళనాడు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశ పెట్టినపుడు పెరియార్ తన '''[[జస్టిస్ పార్టీ''']] ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింప చేశాడు.
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి తన జస్టిస్ పార్టీని ''''[[ద్రావిడర్ కజగం]] '''' అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలను కోరుకునే కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి [[అన్నాదురై]] నాయకత్వం లో ''''[[ద్రవిడ మున్నేట్ర కజగం '''']] ([[డి.యమ్.కె.]]) అనే పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తదుపరి [[యమ్.జి.రామచంద్రన్]] [[డి.యమ్.కె.]] నుండి విడిపోయి ''''[[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం'''']] ([[ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.]])అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు.ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు [[తమిళనాడు]] రాజకీయాలను శాసిస్తున్నాయి.
 
[[వర్గం:1879 జననాలు]]