పిఠాపురం సంస్థానాన్ని [[వెలమకాపు]] రాజులు పాలించే వారు. వీరిలో శ్రీ [[రావు వేంకటకుమారశ్రీ మహీపతికృష్ణ సూర్యారావుదేవరాయలు|సూర్యారావు బహదూర్]] ప్రముఖులు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించారు. వింజమూరి సోమేశ (రాఘవపాడవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, [[అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి]], దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, కురుమెళ్ళ వెంకటరావు మా పిఠాపురం పుస్తకాన్ని రచించారు. ఇందులో శ్రీ వెంకటరావు గారు పిఠాపురం మహారాజ వారితో కలిసి ప్రయాణించిన సంగతులతో పాటుగా పిఠాపురం యొక్క ఖ్యాతి గురించి బహు చక్కగా వివరించారు. ర్యాలి ప్రసాద్ అనేక వచనకవితా సంపుటాలు రచించారు. పిఠాపురం కధలు అనేకం రచించి రాబోయే తరాలకు పిఠాపుర చరిత్రను, సంస్కృతిని అందిస్తున్నారు.