ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15:
భువన ట్రాన్సుపర్ మీద [[రాజమండ్రి]] వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై [[సంతకం]] తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా [[ఏప్రిల్]] 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
అప్పటి నుండి అతడు నిజాలు చెపుతుండటం వలన చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఎన్నో రకాలుగా అతని వలన [[కాలనీ]] వాసులు ఇబ్బందులు పడుతారు. చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి [[జైలు]]కు వెళతాడు. దివాకరంపై [[పగ]] పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని [[గొడుగు]]తో పొడిచి చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపద్ సమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ [[శిక్ష]] పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి వప్పుకుంటుంది.
చిత్రంలో 'చుక్కలు తెమ్మన్నా తీసుకురానా','మాటంటే మాటేనంట కంటబడ్డనిజమల్లా చెబుతా' వంటి హిట్ గీతాలున్నాయి.చిత్రమాద్యంతం హాస్యభరితంగ ఉండి హస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచింది.మల్లికార్జునరావు,రాళ్ళపల్లి,సాక్షి రంగారావు,జయలలిత,వై.విజయ,జయవిజయ,ప్రదీప్ శక్తి,శుభ తదితరులు నటించారు.ఎల్.బి.శ్రీరామ్ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.చిత్రంలో ప్రత్యేకంగా పేర్కొనవలసింది గోదావరి యాసతో సాగే సంభాషణలు(ఎల్.బి.శ్రీరాం?).'చిన్నంతరం పెద్దంతరం లేకుండా','బెడ్డుచ్చుకొట్టానంతేనా','అబ్బో ఏమి స్టోనండి ఏమి స్టోను','జాయి గా గుండు గీయించేస్తానన్నాడు','ఈ పేను కొరుకుడు లేకపోతేనా' ఇత్యాది సంభాషణలు గోదారి తీరంలో ప్రసిద్ధం.
==చిత్ర విశేషాలు==
|