చాకలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Thirupathesh (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
Fixed typos ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి [[శివుడు|
అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు ''యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నీ నీడ మాపై పడకూడదు. నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్త''మంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య , మాచయ్యలు.
మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో ''పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా''్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.
|