బయ్యా సూర్యనారాయణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''బి. ఎస్. మూర్తి''' గా ప్రసిద్ధులైన '''బయ్యా సూర్యనారాయణ మూర్తి''' ([[1909]] - [[1979]]) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
 
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రాజోలు]] తాలూకా [[నగరం]] గ్రామంలో నాగయ్య దంపతులకు [[1909]]లో జన్మించారు. [[రాజమండ్రిరాజమహేంద్రవరం]] మరియు [[చెన్నై]]లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1937-1939 మరళ 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. దేశ స్వాతంత్ర్యయ సమరంలో వ్యక్తి సత్యాగ్రహం మరియు [[క్విట్ ఇండియా]] ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించారు. వీరు 'నవజీవన' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
 
1952, 1957, 1962, 1967 మరియు 1971 లలో జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికలలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు [[పార్లమెంటు]] సభ్యులుగా ప్రజాసేవ చేశారు. భారత ప్రభుత్వ సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ సెక్రటరీగాను, అదే శాఖకు డిప్యూటీ మంత్రిగాను పనిచేశారు.