నవోదయ రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
{{మొలక}}
'''నవోదయ రామమోహనరావు'''గా అందరికీ సుపరిచితులు ''అట్లూరి రామమోహనరావు'' నవోదయ పుస్తక ప్రచురణ సంస్థ, నవోదయ పుస్తకాల అంగడి యజమాని.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1934]], [[ఆగస్టు 1]]న [[కృష్ణా జిల్లా]] [[ఉంగుటూరు (కృష్ణా జిల్లా)|ఉంగుటూరు]] గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన 28వ యేట నుండి పుస్తక ప్రచురణరంగంలో ప్రవేశించి ఆరు దశాబ్దాలకు పైగా అదే రంగంలో ఉన్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లి మతిస్థిమితం లేకపోవడంతో ఇతడు తన పెద్దక్క శేషారత్నం సంరక్షణలో పెరిగాడు. ఇతడు ప్రాథమిక విద్యను ఉంగుటూరులో, హైస్కూలు విద్యను [[గుడివాడ]]లో చదివాడు. ఇతడు కమ్యూనిస్టు పార్టీపై మక్కువతో ఆ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. గుడివాడలో చదివే సమయంలో కమ్యూనిస్టులపై నిర్భందం కారణంగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. తరువాత [[కైకలూరు]]లో తన బావ వద్ద ఉంటూ పదవ తరగతి పూర్తి చేశాడు. పై చదువులు చదివే స్తోమత లేకపోవడంతో నెలకు 50 రూపాయల జీతానికి విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేశాడు. అక్కడ అతనికి కమ్యూనిస్టు పార్టీతో మరింత సంబంధం ఏర్పడింది. కమ్యూనిస్టు నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. 1955లో పర్వతనేని ఝాన్సీలక్ష్మితో వివాహం జరిగింది. 1960లో ఇతని బావ తను స్థాపించిన నవోదయ పబ్లిషర్స్ సంస్థను
==మరణం==
ఇతడు తన 89వ యేట విజయవాడలోని తన స్వగృహంలో [[2019]], [[డిసెంబరు 15]] ఆదివారం నాడు మరణించాడు<ref name="ఈనాడు" />.
|