నవోదయ రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 5:
ఇతడు [[1934]], [[ఆగస్టు 1]]న [[కృష్ణా జిల్లా]] [[ఉంగుటూరు (కృష్ణా జిల్లా)|ఉంగుటూరు]] గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన 28వ యేట నుండి పుస్తక ప్రచురణరంగంలో ప్రవేశించి ఆరు దశాబ్దాలకు పైగా అదే రంగంలో ఉన్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లి మతిస్థిమితం లేకపోవడంతో ఇతడు తన పెద్దక్క శేషారత్నం సంరక్షణలో పెరిగాడు. ఇతడు ప్రాథమిక విద్యను ఉంగుటూరులో, హైస్కూలు విద్యను [[గుడివాడ]]లో చదివాడు. ఇతడు కమ్యూనిస్టు పార్టీపై మక్కువతో ఆ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. గుడివాడలో చదివే సమయంలో కమ్యూనిస్టులపై నిర్భందం కారణంగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. తరువాత [[కైకలూరు]]లో తన బావ వద్ద ఉంటూ పదవ తరగతి పూర్తి చేశాడు<ref name="జ్యోతి">{{cite news |last1=సెంట్రల్ డెస్క్, ఆంధ్రజ్యోతి |title=‘నవోదయ’ రామ్మోహనరావు ఇక లేరు |url=https://www.andhrajyothy.com/artical?SID=982822 |accessdate=17 December 2019 |work=ఆంధ్రజ్యోతి దినపత్రిక |date=16 December 2019}}</ref>.
===వృత్తి===
పై చదువులు చదివే స్తోమత లేకపోవడంతో నెలకు 50 రూపాయల జీతానికి విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేశాడు. అక్కడ అతనికి కమ్యూనిస్టు పార్టీతో మరింత సంబంధం ఏర్పడింది. కమ్యూనిస్టు నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు
===కుటుంబం===
ఇతనికి 1955లో పర్వతనేని ఝాన్సీలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు సుధాకర్, కుమార్తె శోభ జన్మించారు.
==మరణం==
ఇతడు తన 89వ యేట విజయవాడలోని తన స్వగృహంలో [[2019]], [[డిసెంబరు 15]] ఆదివారం నాడు మరణించాడు<ref name="ఈనాడు" />.
|