'''.[[నార్ల వెంకటేశ్వరరావు]]''' ([[డిసెంబర్ 1]], [[1908]] - [[ఫిబ్రవరి 16]], [[1985]]) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు [[రచయిత]]. [[వీ.ఆర్.నార్ల]]గా కూడా వీరు ప్రసిద్ధులు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని [[కథలు]] రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. [[హేతువాది]] గా, [[మానవతావాది]]గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు.