ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Vishal 54363 (చర్చ | రచనలు) Fixed mistakes ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Vishal 54363 (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 50:
</gallery>
</center>
==ఎర్రకోట మూలాలు==
సంస్కృతి, సాంప్రదాయలకు పుట్టినిల్లు అయినా భారతదేశంలో ఎన్నో సంప్రదాయ, చారిత్రాత్మక అద్భుత కట్టడాలు భారత వంశీయ రాజుల చేత నిర్మించబడ్డాయి. వాటిలో ప్రపంచ వారసత్వ పుణ్యం గల నిపుణులను తన అధికారుల చేత రప్పించి కోట నిర్మాణం చేయించారు. యమున నది ఒడ్డున దాదాపు 120 ఏకరాల విస్తీర్ణంలో దీన్ని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ మహాసౌధానికి సంబంధించిన నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించిన ఘనత షాజహన్కే దక్కుతుంది. కాగా, దీని శిల్పి మాత్రం హమీద్. 2.41కి.మీల విస్తీర్ణంలో రెండు ప్రధాన ద్వారాల(గేట్స్)తో నిర్మించారు. అవి, లాహోర్ గేట్, ఢిల్లీ గేట్. ఇక ఎర్రకోట ప్రహరీగోడ కూడా భారీగానే నిర్మితమైంది. 2కి.మీల పొడవు, 90 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించడం జరిగింది. కోటలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మజీద్, దివానీ ఖాస్, దివాన్-ఇ-ఆమ్ ముఖ్యమైనవి. దివాన్-ఇ-ఆమ్లో రాజు ప్రజల వినతులు వినేవారట. ఇక్కడ పర్షియన్ నిపుణుల చేత వజ్రాలు, బంగారం పొదిగిన నెమలి సింహాసనంపై కూర్చుని రాజు ప్రజల సమస్యలు పరిష్కరించేవారు. దీని లోపలి గోడలపై బంగారం, వెండితో అద్భుతమైన పెయింటింగ్స్తో పాటు కొన్ని శ్లోకాలు రాశారు. వీటిలో ‘ఇళలో స్వర్గమంటూ ఉంటే అది ఇదే ఇదే’ అనే శ్లోకం కూడా ఉంది. ఇది పర్షియన్ కవి అమీర్ ఖుష్రో రచించిన పద్యంలోని ఒక లైన్. చక్రవర్తి షాజహన్ ఎర్రకోటను షాజనాబాద్కు కొత్త రాజధానిగా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎర్రకోటపై జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో మొదట జాతీయ జెండాను ప్రధానమంత్రి ఇక్కడే ఆవిష్కరిస్తారు. {{reflist}}
|