మునిమాణిక్యం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_date = [[మార్చి 15]], [[1898]]
| birth_place =[[తెనాలి]] తాలూకా, [[సంగం జాగర్లమూడి]]
| native_place =
| native_place =[[తెనాలి]] తాలూకా, [[సంగం జాగర్లమూడి]]
| death_date = ఫిబ్రవరి 4, 1973
| death_place =
పంక్తి 37:
'''మునిమాణిక్యం నరసింహారావు''' ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం [[తెలుగు]] సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.
==జీవిత విశేషాలు==
'''మునిమాణిక్యం నరసింహారావు''' [[తెనాలి]] తాలూకా, [[సంగం జాగర్లమూడి]]లో [[మార్చి 15]], [[1898]] న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈయన [[తెనాలి]]లో ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే [[కొండా వెంకటప్పయ్య]] గారి ఆయన సహాయం వల్ల [[బి.ఎ]] చదివారు.ఆయన భార్య కాంతం.<ref>[http://sahithyaseva.blog.com/2011/04/12/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%82-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B0%E0%B0%A3/ కాంతం కథలకు అమ్మే ప్రేరణ]</ref> ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]లో ఉపాధ్యాయుడిగా, [[ఆకాశవాణి]]లో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన [[రేడియో]] నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది.[[దస్త్రం:Munimanikyam on Anandavani coverpage.jpg|thumb|left|150px|ఆనందవాణి ముఖచిత్రంపై మునిమాణిక్యం నరసింహారావు]] ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.
 
తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.[[తెలుగు]] హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు. ఆయన కుమారుడు [[మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య]] కూడా రచయితగా రాణించాడు.