నహుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నహుషుడు''' ([[సంస్కృతం]]: नहुष) [[చంద్ర వంశం]]లో జన్మించిన రాజు. ఇతడు [[ప్రభ]] - [[ఆయువు]]ల పుత్రుడు. [[ప్రియంవద]] ద్వారా యతి, [[యయాతి]], సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు [[యాగాలు]] చేశాడు.
 
[[దేవేంద్రుడు]] స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు [[వృత్రాసురుడు|వృత్రాసురుణ్ణి]] సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో తామరతూడులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై [[శచీదేవి]]ని కోరుకుంటాడు. ఆమె [[విష్ణు]]ముర్తిని వేడుకొనగా, ఆతని సలహా మేరకు నహుషున్ని తనవద్దకు [[సప్తర్షులు]] పల్లకీ మోయగా రమ్మని కోరుతుంది. తప్పని పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తర్షులలో [[అగస్త్య మహర్షి]]ని నషుషుడు కాలితో తంతాడు.
"https://te.wikipedia.org/wiki/నహుషుడు" నుండి వెలికితీశారు