భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Salma rasool (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 8:
[[File:Kurukshetra.jpg|thumb|left|[[కురుక్షేత్ర యుద్ధం|కురుక్షేత్ర యుద్ధాని]]కి సంబంధించిన చిత్రలేఖనం]]
ఇండో-ఆర్యన్ల ఋగ్వేద తెగలు, ‘రాజు’ అనిపిలవబడే తమ నాయకుల ఆధ్వర్యంలో, తమలో తాము, ఇతర తెగలతోనూ యుద్ధాలు చేసేవారు. [[ఋగ్వేదం]]లో వర్ణించినట్టు వీరు కంచు ఆయుధాలు, గుఱ్ఱాలు లాగే రథాలు వాడేవారు. యుద్ధంలో లభించిన ‘కొల్లసొమ్ము’ (ముఖ్యంగా పశుసంపద)లో సింహభాగం తెగనాయకునికి చేరేది. ఈ వీరులందరూ [[క్షత్రియ]] వర్ణానికి చెందినవారు.
ఋగ్వేదానంతర కాలం ([[ఇనుప యుగం]] - క్రీ.పూ 1100-500)లో వచ్చిన వేదాలలోనూ, ఇతర సాహిత్యంలోనూ, సైన్యం గురించి తొలిప్రస్తావనలు కనిపిస్తాయి. గజబలం యొక్క తొలి ప్రస్తావనలు ఈ కాలంనాటివే.<ref>
భారతదేశపు గొప్ప ఇతిహాసాలైన [[రామాయణం|రామాయణ]], [[మహాభారతం|మహాభారతాలు]], [[మహా జనపదాలు]] ఏర్పడుతున్న కాలంనాటి సైనికనిర్మాణాలు, యుద్ధరీతులు, ఆయుధాల గురించి వర్ణనలు కలిగి ఉంటాయి. యుద్ధ రథాలు, గజబలాలు, వైమానిక దళాల గురించి కూడా వర్ణనలు ఉన్నాయి. [[మహాభారతం]]లో యుద్ధవ్యూహాలు ([[పద్మ వ్యూహం]], [[క్రౌంచ వ్యూహం]] ఇత్యాది) గురించి కూడా వర్ణనలున్నాయి.
==మగధ రాజ్యాలు==
పంక్తి 47:
పురాణ కథల ప్రకారం, ఆంధ్రజాతికి చెందిన శాతవాహనులు, దక్షిణాపథంలో మొట్టమొదటి సామ్రాజ్యస్థాపకులు. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.
:"Next come the Andarae, a still more powerful race, which possesses numerous villages, and thirty towns defended by walls and towers, and which supplies its king with an army of 100,000 infantry, 2,000 cavalry, and 1,000 elephants." Plin. Hist. Nat. VI. 21. 8-23. 11., quoting Megasthenes<ref>
ఆంధ్రులు మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత మరియు నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం.
పంక్తి 220:
పాకిస్తాన్ తో యుద్ధానంతరం, భారతదేశం స్వతంత్ర హైదరాబాద్ పైన దృష్టిపెట్టింది. ఆ సమయంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో [[తెలంగాణ]]లో సాయుధ పోరాటాలు సాగుతున్నాయి. దాని ఫలితంగా స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ ను కొనసాగించాలనుకున్న నిజాం నవాబు, పాకిస్తాన్ నుండి [[ఖాసిం రిజ్వీ]] నాయాకత్వంలో '''రజాకార్''' అనబడే సైన్యాన్ని తెలంగాణలో నడిపించాడు. నిజాం నవాబు, హైదరాబాదుని పాకిస్తాన్ లో విలీనం చేయవచ్చనే వార్తలు వస్తున్న కాలంలోనే భారత ప్రభుత్వం [[ఆపరషన్ పోలో]]ని ప్రారంభించింది. ఐదు రోజులు సాగిన పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ రాజ్యం, భారత గణతంత్ర రాజ్యంలో కలిసింది.
====గోవా ఆక్రమణ, 1961====
భారతదేశం, గోవాని తన ప్రాంతంగా పేర్కొన్న అనంతరం, భారత-పోర్చుగల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశంలో కలవాలని సాగుతున్న శాంతియుత ప్రదర్శనపై పోర్చుగీసు పోలిసులు విచక్షణారహితంగా విరుచుకుపడడంతో, భారతదేశం గోవాని ఆక్రమించడానికి పూనుకున్నది. భూ,జల,గగన మార్గాలన్నిటినీ భారతదేశం చుట్టుముట్టడంతో,<ref>{{cite web |url=http://www.goacom.com/culture/history/history4.html |title=Goa's Freedom Movement |publisher=Goacom.com |date= |accessdate=2012-03-14 |website= |archive-url=https://web.archive.org/web/20120214125132/http://www.goacom.com/culture/history/history4.html |archive-date=2012-02-14 |url-status=dead }}</ref> కేవలం 36 గంటలలో, 461 సంవత్సరాల పోర్చుగీసు పాలన అంతమయ్యింది. ఈ యుద్ధం పోర్చుగీసు సైనికులు చనిపోయినవారు 31, గాయపడినవారు 57, పట్టుబడినవారు 3306. భారతదేశ సైనికులు చనిపోయినవారు 34, గాయపడినవారు 51.
====భారత-చైనా యుద్ధం 1962====
====రెండవ భారత-పాకిస్తాన్ యుద్ధం 1965====
|