మిరాసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
16 వ శతాబ్దంలో మిరాసీలు ఉత్తర ప్రదేశు నుండి బీహారుకు వచ్చినట్లు పేర్కొనబడింది. బీహారులోని చాలా మంది జమీందార్ల ఆస్థానంలో సంగీతకారులు ఉన్నారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంతో మిరాసీలు వ్యవసాయ వృత్తిని స్వీకరించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి ప్రత్యేక సందర్భాలలో పాటలు పాడటానికి కొంతమందిని ఇప్పటికీ వీరిని పిలుస్తారు. చాలా మంది మిరాసిలు ఇప్పుడు షియా, మొహరం ఉత్సవాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్రధానంగా భాగల్పూరు, భోజ్పూరు, గయా, ముంగేరు, నలంద, పాట్నా జిల్లాలలో కనిపిస్తారు. మిరాసీ తమలో తాము మగధీ భాషలో సంభాషిస్తారు. అలాగే బయటి వ్యక్తులతో ఉర్దూలో సంభాషిస్తారు. ఇతర మిరాసి వర్గాల మాదిరిగా కాకుండా బీహారు మిరాసి ఎప్పుడూ వంశావళి శాస్త్రవేత్తలుగా పనిచేయలేదు. పమారియా సమాజం బీహారు మిరాసి ప్రధాన ఉపవిభాగంగా ఉన్నారు.<ref>People of India Bihar Volume XVI Part Two edited by S Gopal & Hetukar Jha pages 683 to 685 Seagull Books</ref>
 
=== In Delhi ఢిల్లీ===
ఢిల్లీలోని మిరాసి సంతతి కులమని పేర్కొన్నారు. వీరు సీలాంపూరు, షాహదారా, బవానా, నరేలా ప్రాంతాలలో కనిపిస్తారు. వారు ఖాను, బొబ్లా, పోస్లా, మల్లికు అనే ఇంటిపేర్లను కలిగి ఉన్నారు. ఢిల్లీ మిరాసి గాయకులు, సంగీతకారులు, ఢిల్లీలోని మొఘలు రాజసంభతో సంబంధం కలిగి ఉన్నారు. చాలా మంది మిరాసి ఖండన్లు (కుటుంబాలు) చక్రవర్తుల ఆస్థానంలో గొప్ప ఖ్యాతిని పొందారు. మరికొందరు నిజాముద్దీను వంటి వివిధ సూఫీ పుణ్యక్షేత్రాలలో భక్తి గాయకులు (కవ్వాలులు). కొందరు రాగ్ని గాయకులు వంటి సాంగిగా ఉండేవారు. స్వాతంత్ర్య సమయంలో ఢిల్లీలోని ముస్లిం వర్గాలు చాలా మంది సభ్యులు పాకిస్తానుకు వలస వెళ్ళారు. కూరగాయలు అమ్మడం, గొడుగులను మరమ్మత్తు చేయడం వంటి చిన్న వ్యాపారాలలో చాలా మంది ఇప్పుడు పాల్గొంటున్నారు.<ref>People of India Delhi Volume XX edited by T. K Ghosh & S Nath pages 475 to 477 Manohar Publications</ref>
 
"https://te.wikipedia.org/wiki/మిరాసి" నుండి వెలికితీశారు