బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
}}
 
దక్షిణ భారతదేశంలో [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''బి.ఎస్.యడ్యూరప్ప''' (B. S. Yeddyurappa) [[1943]], [[ఫిబ్రవరి 27]]న [[మాండ్యా]] జిల్లాలోని బూకనాకెరెలో జన్మించాడు.<ref name="legis">{{cite web|url=http://legislativebodiesinindia.gov.in/States/kanataka/oppositionleader.htm|work=Online webpage of the Legislative Bodies of India|publisher=Government of India|title=B. S. Yediyurappa|accessdate=2007-11-12|archive-url=https://web.archive.org/web/20080530021131/http://legislativebodiesinindia.gov.in/States/kanataka/oppositionleader.htm|archive-date=2008-05-30|url-status=dead}}</ref>) [[1970]]లోనే శికారిపుర శాఖకు [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యదర్శిగా నియమించబడి [[1972]]లో తాలుకా శాఖకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. [[1975]]లో శికారిపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు. [[1980]]లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాకుకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను, ఆ తరువాత [[శిమోగా]] జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగాను పనిచేశాడు. [[1988]] నాటికి [[కర్ణాటక]] రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగాడు. [[1983]]లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు. [[2007]] [[నవంబర్|నవంబర్‌లో]] ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో [[మే 30]], [[2008]]న రెండో పర్యాయం కర్ణాటక [[ముఖ్యమంత్రి|ముక్యమంత్రి]]గా ప్రమాణస్వీకారం చేశాడు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా రికార్డు సృష్టించాడు.<ref name="first">{{cite web|url=http://www.hindu.com/thehindu/holnus/001200711121314.htm|work=Online Edition of The Hindu dated 2007-11-12|title=Yeddyurappa's journey from farming to chief ministership|accessdate=2007-11-12}}</ref> ఇతని అసలుపేరు యడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నాడు.<ref name="name">{{cite web|url=http://www.telegraphindia.com/1071030/asp/nation/story_8489023.asp|work=Online Edition of The Telegraph, dated 2007-10-30|title=Parade done, over to Raj Bhavan, Path cleared for BJP reins|accessdate=2007-11-12}}</ref>
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="born">{{cite web|url=http://www.hinduonnet.com/holnus/001200711100301.htm|title=Yeddyurappa to become BJP's first CM in South|accessdate=2007-11-12}}</ref><ref name="bio">{{cite web|url=http://kla.kar.nic.in/cm.htm|work=Online webpage of the Karnataka Legislature|title=B. S. Yediyurappa|accessdate=2007-11-12|archive-url=https://web.archive.org/web/20080606102219/http://kla.kar.nic.in/cm.htm|archive-date=2008-06-06|url-status=dead}}</ref> అతడు నాలుగేళ్ళ వసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది.<ref name="first"/> ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసి [[1965]]లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు.
== వ్యక్తిగత జీవితం ==
యడ్యూరప్ప [[1967]]లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని [[వివాహం]] చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).<ref name="family"/> 2004లో భార్య ప్రమాదావశాత్తు మరణించింది.
== రాజకీయ ప్రస్థానం ==
1970లో శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.<ref name="family"/> 1975లో శికారిపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లోనే [[ఇందిరాగాంధీ]] ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించుటతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 1975 నుంచి 1977 వరకు [[బళ్ళారి]] మరియు శిమోగా జైళ్ళలో జీవనం కొనసాగించాడు. 1980లో [[భారతీయ జనతా పార్టీ]] ఆవిర్భవించుటలో పాత జనసంఘ్ నేతలతో పాటు యడ్యూరప్ప కూడా భారతీయ జనతా పార్టీలో చేరి శిమోగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని పొందినాడు. 1988 నాటికి కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనాడు. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్నాడు. కర్ణాటక 10వ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. [[1999]]లో ఎన్నికలలో ఓడిపోయిననూ పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్అయ్యాడు.<ref name="legis"/> ధరంసిం ప్రభుత్వాన్ని పడగొట్టుటకు జనతాదళ్ (ఎస్)కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని తొలుత కుమారస్వామి ముఖ్యమంత్రిత్వానికి మద్దతు పలికినాడు. యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 20 మాసాల గడుపు తీరిపోయిననూ కుమారస్వామి భారతీయ జనతా పార్టీకు అధికారం అప్పగించకపోవడంతో భాజాపా అగ్రనేతలు జోక్యం చేసుకొని చివరకు యడ్యూరప్పకు 2007 నవంబర్‌లో అధికారం అప్పగించిననూ కుమారస్వామి మనసుమార్చుకొని వెంటనే మద్దతు ఉపసంహరించడంతొ వారంరోజులకే [[దక్షిణ భారతదేశం]]లో ఏర్పడిన తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజాపా దాదాపు పూర్తి మెజారిటీ సాధించింది. యడ్యూరప్పను ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టి ప్రకటించినందువల్ల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అవాంతరం జరుగలేదు. యడ్యూరప్ప స్వయంగా మళ్ళీ శికారిపుర శాసనసభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 45 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. 2008, మే 30న యడ్యూరప్ప రెండో పర్యాయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>http://abclive.in/abclive_regional/yeddyurappa-karnataka-cm.html{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.యడ్యూరప్ప" నుండి వెలికితీశారు