క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ మార్పు
పంక్తి 3:
 
==క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం==
రాక్షసుల బాధ పడలేక దేవతలు [[శివుడు|శివుని]], [[బ్రహ్మ|బ్రహ్మను]] వెంట బెట్టుకొని [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా [[మందరగిరి]] ని వాడండి. త్రాడు గా [[వాసుకి]] ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.
 
ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే [[బలి]] చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయం లో ఒకరోజు [[ఇంద్రుడు]] రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు