కుంజి లాల్ దుబే: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
==తొలినాళ్ళ జీవితం==
ఈయన 1896 మార్చి 18 న మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని అమ్గావ్ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను కరేలిలోని గ్రామ పాఠశాలలో, నరసింగ్‌పూర్‌లో మరియు అకోలాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు.ఈయన 1914 లో జబల్పూర్ లోని రాబర్ట్సన్ కాలేజీలో చేరిన అతను 1918 లో పట్టభద్రుడయ్యాడు. 1920 అలహాబాద్ లో తన గ్రాడ్యుయేషన్ ని లా విభాగంలో పూర్తిచేసాడు. ఈ సమయంలోనే ఈయన మదన్ మోహన్ మాలవియా, నరసింహ చింతమన్ కేల్కర్ వంటి భారత స్వాతంత్ర్య సమరయోధులను కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన 1934 లో ఇంటర్-యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా, బర్మా మరియు సిలోన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మరియు దాని శాసనసభ అధ్యక్ష పదవిని కూడా చేపట్టాడు. మరుసటి సంవత్సరం ఈయన జబల్పూర్ హిట్కారిని లా కాలేజీలో ప్రొఫెసర్ గా చేరాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాలతో తనను తాను పొత్తు పెట్టుకుని, 1937 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) లో సభ్యుడయ్యాడు మరియు రెండు సంవత్సరాల తరువాత, 1939 లో ఎఐసిసి యొక్క త్రిపురి సెషన్ సమావేశమైనప్పుడు ఈయన రిసెప్షన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన్ని1941 లో మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి ఎంపిక చేశాడు, కాని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 1942 లో జైలు నుండి విడుదలైన తరువాత, ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్ళీ జైలు పాలయ్యాడు. ఈయన 1946 లో జబల్పూర్ నుండి మొదటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మధ్యప్రదేశ్ యొక్క మొదటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు. ఈయన 1957 నుండి 1962 వరకు మరియు 1962 నుండి 1967 వరకు మరో రెండు పర్యాయలకు స్పీకర్ గా చేసాడు. 1946 లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన అదే సంవత్సరంలో, అతను నాగ్పూర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా వరుసగా మూడుసార్లు నియమితుడయ్యాడు. ఈయనకి హిందీ మరియు మరాఠీ విభాగాలకు సీట్లు ఏర్పాటు చేశాడు మరియు 34 హిందీ గ్రంథాలు మరియు 42 మరాఠీ గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించి, స్థానిక భాషలలో మాట్లాడే విద్యార్థులకు సైన్స్ విషయాలు తెలిసేలా వివరించాడు. మధ్యప్రదేశ్ సాహిత్య సమ్మెలన్తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు మరియు ఒక పదవికి దాని అధ్యక్షుడిగా పనిచేశాడు.
==పురస్కారాలు మరియు గుర్తింపులు==
ఈయనకు భారత ప్రభుత్వం 1964 లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈయనకు 1965 లో జబల్పూర్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ లా (హానెరిస్ కాసా) డిగ్రీని అందుకున్నాడు. 1967 లో విక్రమ్ విశ్వవిద్యాలయం నుండి డి. లిట్ అందుకున్నాడు. 1996 లో ఇండియా పోస్టల్ విభాగం స్మారక తపాలా స్టాంపుతో సత్కరించింది.
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/కుంజి_లాల్_దుబే" నుండి వెలికితీశారు