మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

1Lib1Ref
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 5 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్.రెడ్డి రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] చేత "మల్లీశ్వరి" స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథారచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు.<ref name="బుచ్చిబాబు గురించి గొల్లపూడి">{{cite news|last1=గొల్లపూడి|first1=మారుతీరావు|title='బుచ్చిబాబు' చిరంజీవి|url=http://www.sakshi.com/news/editorial/writer-buchi-babu-lives-forever-247555|accessdate=11 June 2015|work=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|date=11 జూన్ 2015}}</ref>
 
బి.ఎన్.రెడ్డి ఈ సినిమా స్క్రిప్టును కృష్ణశాస్త్రితో కూర్చుని చాలా శ్రద్ధగా అభివృద్ధి చేయించుకున్నాడు. సినిమాలో మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్య గానాలను మారువేషంలో చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఆమెను మెచ్చుకుంటూ ఓ పద్యం చెప్పే సన్నివేశం ఉంది. అల్లసాని పెద్దన రాసినట్లుగా అల్లిక జిగిబిగితో రావాలన్న జాగ్రత్త వల్ల కృష్ణశాస్త్రితో 108 పద్యాలు రాయించుకుని అందులో ఒక్కటి ఎంపిక చేసుకున్నాడు బి.ఎన్.రెడ్డి.<ref>{{Cite book|title=కళాత్మక దర్శకుడు బి.యెన్.రెడ్డి|last=దక్షిణామూర్తి|first=పాటిబండ్ల|publisher=|year=|isbn=|location=|pages=}}</ref><ref name=":0">{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=30|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
=== నటీనటుల ఎంపిక ===
 
=== చిత్రీకరణ ===
చిత్రీకరణ విషయంలోనూ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదాహరణకు సినిమాలో నాటకాన్ని చూడడానికి రాణి, రాజు వేర్వేరుగా బయలుదేరేప్పుడు రాణి బయలుదేరే వైభవాన్నే చూపించి, రాజుది తెరపై చూపకుండా వదిలేశాడు. దేనికంటే బి.ఎన్.రెడ్డి - "రాణిగారి వైభవం చూసి రాజుగారిది మరెంత గొప్పగా ఉంటుందోనని ప్రేక్షకులు ఊహించుకోవడానికి వదిలేయాలి. ఎంతో గొప్పగా ఊహించుకునే రాయలవారి వైభవాన్ని సంతృప్తికరంగా చిత్రీకరించడం కష్టం" అని వివరించాడు. ఇలా చిత్రీకరించిన సన్నివేశాలను, చిత్రీకరించకుండా వదిలివేసినవి కూడా జాగ్రత్తగా ఎంచుకుని చేశాడు.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=28|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పటేల్ మరణిస్తే అతని అభిమాని, అతనితో కొంత స్నేహం కలిగిన బి.ఎన్.రెడ్డి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అసిస్టెంట్లకు వదిలివెళ్ళాడు. వచ్చి చూసుకునేసరికి మహారాణి తిరుమలదేవి పాత్రధారిణి మహారాణికి తగినట్టు కొంగు వెనుక విడిచి నడవకుండా, కుడిచేత్తో పట్టుకుని సామాన్యురాలిగా నడిచినట్టు కనిపించింది బి.ఎన్.రెడ్డికి. దాంతో ఆ దృశ్యం తిరిగి చిత్రిస్తానని పట్టుబట్టగా, భాగస్వాములు ఆ కాస్త షాట్ల కోసం తిరిగి సెట్ వేసి చిత్రీకరించడం ఆర్థికంగా భారమని వివరించి ఎలాగో ఒప్పించారు.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=29|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==పాటలు==
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. స్త్రీలను ఆకర్షించేందుకు భక్తి పాటలను ఏదో విధంగా చొప్పించే రోజుల్లో ఈ సినిమాలో టైటిల్స్‌ శ్రీగణనాథం అనే పిళ్ళారి గీతం తప్ప మిగతా పాటలన్నీ సినిమాకు ముఖ్య కథాంశమైన అనురాగం, ప్రణయం, రెండవ థీం అయిన విజయనగర వైభవం చుట్టూ ఉండేలా రూపొందించారు.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=30|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సల్స్ నిర్వహించారు. [[అద్దేపల్లి రామారావు]] ఆర్కెస్ట్రా నిర్వహించాడు.
 
* లంబోదర లకుమికరా - [[పురందర దాసు]] కీర్తన
పంక్తి 68:
 
== స్పందన ==
మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సాధించింది. మల్లీశ్వరి తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచారు. ఈ సినిమా రచన చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మద్రాసు (నేటి చెన్నై) [[పచ్చయ్యప్ప కళాశాల]] అధ్యాపక బృందం సన్మానించగా కృష్ణశాస్త్రి ఆ సందర్భంగా "వాస్తవంగా దీనికి అర్హుడైన వ్యక్తిని నేను కాదు. మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం" అన్నాడు.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=25|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==విశేషాలు==
పంక్తి 83:
 
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20070913054552/http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl?mcode=M0115 మల్లీశ్వరి పాటలు ఇక్కడ వినవచ్చును]
* [https://web.archive.org/web/20070203200407/http://www.cinegoer.com/malleswari.htm సినీగోయెర్ లో మల్లీశ్వరి గురించి వ్యాసము]
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు