శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం''' ([[ఆంగ్లం]]: Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam) [[తెలంగాణా]] రాజధాని [[హైదరాబాదు]] లోని ప్రాచీన [[గ్రంథాలయము]].<ref>[http://www.hindu.com/2007/03/14/stories/2007031419580400.htm Andhra Bhasha Nilayam demolished in The Hindu.]</ref>
 
ఈ గ్రంథాలయం [[సెప్టెంబర్ 1]], [[1901]] సంవత్సరంలో ([[ప్లవ]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ తదియ]] ఆదివారం) [[హైదరాబాదు]]లోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడింది.<ref name="తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది...........">{{cite web|last1=వరంగల్ ముచ్చట|title=తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది...........|url=http://www.warangalmucchata.com/2016/08/115.html|website=www.warangalmucchata.com|accessdate=14 June 2017}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు నాయని వేంకట రంగారావు మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు. అప్పటి [[పాల్వంచ]] రాజాగారైన పార్థసారధి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], డా. [[ఎం.జి.నాయుడు]], [[ఆదిపూడి సోమనాథరావు]], శ్రీ మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, [[ఆదిరాజు వీరభద్రరావు]], కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.
 
[[File:Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam-Hydarabad-1 (1).jpg|thumb|భాషానిలయ భవనం]]