కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత [[సూర్యాపేట]]లో [[మెట్రిక్]] పూర్తిచేశారు. ఆర్థిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, [[గ్రంథాలయోద్యమం]], జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. [[ఖమ్మం]]లోని [[విజ్ఞాన నికేతన గ్రంథాలయం]] ఆయన కృషి వలన స్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం మరియు బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.
 
1944లో [[ఇల్లెందు]]లో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షతన జరిగింది. [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణ]] ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. [[విశాలాంధ్ర]] స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.
 
[[ఖమ్మం]]లో అస్పృశ్యతా నివారణ కోసం నిర్విరామంగా కృషిచేశారు. కోదాటి నాయకత్వంలో ఎందరో యువకులకు తిరుగుబాటు బీజాలు వేసి కనువిప్పు కలిగించారు. ఎం.ఎస్. రాజలింగం, కొమరగిరి నారాయణరావు, యల్లాప్రగడ కృష్ణమూర్తి, సుగ్గుల అక్షయలింగం గుప్తా, గెల్లా కేశవరావు మరెందరో హరిజజ హాస్టలులో విద్యార్థులకు చదువుచెప్పి జ్ఞానజ్యోతి వెలిగించారు. [[వర్తక సంఘం]] ఏర్పాటుచేసి వారిమధ్య తగాదాలను పరిష్కరించేవారు.
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు