పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె
చి →‎చరిత్ర: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 40:
పుష్కర్ అతి పురాతన నగరము. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ [[బ్రహ్మ]]దేవుడు రాధా కృష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల కథనాలు చెప్తున్నాయి.
బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం 14వ శతాబ్దంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత [[ఆదిశంకరాచార్యుడు]] ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి ఉన్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ [[బ్రహ్మ]]విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద [[సరస్వతి]]దేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలో పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడా పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన. గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు ఉంది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి, అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనే పుష్కర్ జాతర కూడా జరుగుతుంది. ఇది దీపావళి తరువాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న [[సావిత్రి]], [[గాయత్రి]] దేవతలను కూడా భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది. అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్‌జీ ఆలయం ఉంది. ఇక్కడి [[విష్ణువు|విష్ణు]]మూర్తిని రంగ్‌జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.
* రామణంలో ఈ నగర ప్రస్తావన ఉంది. [[వశిష్ఠుడు]] ఇక్కడ తపసు చేసినట్లు వర్ణించబడింది.
* అరప్సరకాంత [[మేనక]] పుష్కరక్షేత్రంలో స్నానం చేసినట్లు వర్ణించబడింది.
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు