తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
ఇతడు [[1790]]లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం [[పొన్నూరు]]లో పేష్కారుగా పనిచేశాడు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
 
దాసు [[భారతదేశం]] అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించాడు. కాలినడకన దాసు కాశీయాత్ర, [[పూరీ]], [[కుంభకోణం]], [[తిరువయ్యూరు]] దర్శించాడు. మహాభక్తుడైన [[త్యాగరాజు]] దాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పాడు. తరువాత [[కాంచీపురం]], [[తిరుపతి]], [[అయోధ్య]], [[హరిద్వారం]] కూడా దర్శించాడు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. [[రామచంద్రుడు]] ఒకనాటి రాత్రి కలలో కన్పించి [[హైదరాబాదు]]లో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును [[భద్రాచలం]], [[పాల్వం]]చ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందాడు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు [[వరద రామదాసు]] తమ ఐశ్వర్యాన్ని [[భద్రాద్రి]] రాముని కైంకర్యానికే వినియోగించారు. [[భద్రాచలం]] కలియుగ [[వైకుంఠం]]<nowiki/>తో తులతూగినది. నారద తుంబురులే, [[నరసింహ]], వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.
 
వరద రామదాసుకు [[క్షయ]] వ్యాధి సోకింది. నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు [[విజయ (సంవత్సరం)|విజయ]] సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయాడు. అతని భౌతిక కాయాన్ని [[గోదావరి]] నదిలో నిమజ్జజం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు.