కడవెండి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 158:
- దొడ్డి కొమురయ్య - (తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు)
నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. నిజాం సర్కారు హయాంలో విస్నూర్ కేంద్రంగా దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్ముఖ్ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.
|