సురవరం ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 50:
 
==రచనా వ్యాసంగం ==
సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా [[పాలమూరు జిల్లా]]కు చెందిన 87 కవుల వివరాలున్నాయి.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, ఆచార్య [[ఎస్వీ రామారావు]] రచన, సెప్టెంబరు 2012, పేజీ 10</ref> ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ''[[ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. ''సురవరం ప్రతాపరెడ్డి కథలు'' నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. ''హైందవ ధర్మ వీరులు'', ''[[హిందువుల పండుగలు]]'', ''రామాయణ కాలం నాటి విశేషాలు'' మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. ''[[భక్త తుకారాం]]'', ''ఉచ్ఛల విషాదము'' అనే నాటకాలు రాసాడు. ఈయన రాసిన కథలు మొగలాయీ కథలు పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అణా గ్రంథమాల 1940లో అచ్చువేసింది<ref>అక్షర నక్షత్రాలు, రచన:నియోగి, సెప్టెంబర్ 2019, పేజీలు 1-3</ref>. రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించిన [[ఆంధ్రమహాసభ]] మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.
 
==రాజకీయాలు==