తిమ్మరుసు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
==హత్యారోపణ - కథ==
కళింగాధీశుడు వీరభద్రగజపతి, శ్రీకృష్ణదేవరాయల చేతిలో పరాజయమును తట్టుకోలేక ప్రతీకరేఛ్చతో అతని మనుమని (శ్రీకృష్ణదేవరాయనికి వీరభద్రగజపతి కుమార్తె ద్వారా కలిగిన కుమారుని) హత మార్చి ఆ నేరమును తిమ్మరుసుపై మోపినాడని, శ్రీకృష్ణదేవరాయలు సరియైన విచారణ సలపక, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు కనుగుడ్లు పీకించినాడను కథ వాడుకలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేవుకాని నాటకీయత కలిగి ఉండడంతోనాలుగైదు నాటకాలు ఈ కథాంశంతో రచించబడి ప్రాముఖ్యత పొందేయి.
 
===న్యూనిజ్ కధ===
తిమ్మరుసు హత్యారోపణకి మూలం న్యూనిజ్ అనే పొర్చుగీసు వర్తకుని కధనం. ఈన్యూనిజ్ రాయలకాలం నాటికి విజయనగరంలో ఉండి తను చూచిన, వినిన వృతాంతములను ఒక కధనంగా వ్రాసాడు. అవె ఈ క్రింది అంశములు:
1)రాయలు రాయచూరు యుద్ధం అయిన తరువాత తనకు వయసుమీరినదని తెలుసుకున్నాడు. 2) అతనికి ఆరు సం. పుత్రుడు ఉన్నాడు. 3) రాయలు తన పుత్రుడు తన తరువాత రాజ్య పాలన చేపాట్టాలనే ఆకాంక్షతో తన రాజ్యత్యాగం చేసి, పుత్రునికి పట్టభిషేకం చేసి, తను అతనికి మంత్రి అయి, అంతవరకూ తనకు మహా ప్రధానిగా ఉండిన తిమ్మరుసును తనకు సలహాదారునిగా చేసుకున్నాడు. 4) పట్టాభిషేకోత్సవములు 8 నెలలు జరిగినవి. 5) పిమ్మట రాయల కుమారుడు వ్యాధిగ్రస్థుడై మరణించినాడు. 6) కొంత కాలానికి తన కుమారుడు తిమ్మరుసు మంత్రి కుమారుడు విషప్రయోగం చేయడం వలన మరణించాడని రాయలకు తెలిసింది. 7) అంతట రాయలు తిమ్మరుసును, పుత్రుని, తమ్ముడైన గోవిందరాజును నిండు సభలో నిందించి, తిమ్మరుసును ఆతని ఇద్దరు పుత్రులను మూడు సం. కాలం చెరసాలలో ఉంచాడు. 8) తర్వాదన్నాయకుడు (దండనాయకుడు) తిమ్మరుసు కుమారుడు చెరసాలనుంచి తప్పించుకొని, ఒక ప్రబలమైన దుర్గం చేరి, అక్కడనుంచి రాయలపై తిరుగుబాటు చేశాడు. రాయలు సైన్యమును పంపి ఆతనిని బంధించినాడు. 9) ఆమీద ఇతనితో పాటు తిమ్మరుసును, ఆతని మరియొక పుత్రుని సముఖమునకు పిలిపించి రాయలు వీరందరి కండ్లూడదీయించి చెరలో బంధించినాడు. 10) తిమ్మదనాయకుడు చెరలో మరణించినాడు. తిమ్మరుసు,ఆతని మరియొక పుత్రుడు చెరలోనే ఉండిపోయారు.
 
న్యూనిజ్ చెప్పిన ఈకధ మరియేఇతరాధారములలోనూ కనిపించదు. ఈకధని బట్టి తిమ్మరుసు మంత్రికి తిమ్మదనాయకుడు ఒకడూ, గండరాజు అను ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలుస్తుంది.కాని తిమ్మరుసును రాజు సభలో నిందించినప్పుడు ఆతని కుమారుడు ఒకడే ఉన్నట్టున్నూ, మూడు సం.లు చెరలో ఉండినది ఆతనితో పాటు ఆతని పుత్రులు ఇద్దరు అని పరస్పర విరుద్ధమైన్ విషయం న్యూనిజ్ వ్రాసాడు. అందుకే చరిత్రకారులు ఈ కధను విశ్వసనీయంగా గుర్తించరు.
 
న్యూనిజ్ కధనం రాయల్ కుమారుని పట్టభిషేకం వరకు విశ్వసనీయంగా కనిపిస్తుంది. క్రీ.శ.1517నాటి ఒక శాసనంలో రాయలకు సంతానప్రాప్తి కావెలనని కొండమరసు మంత్రి కాంక్షించినట్లు ఉన్నది.అప్పటికే రాయలకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలుండుటవలన, ఆకాంక్ష పుత్ర సంతానానికి సంబంధించినదని ఊహించవచ్చును. క్రీ.శ. 1518 అక్టోబరు 20వ తేదీనాటి ఒక శాసనం రాయల దేవేరి అయిన తిరుమలదేవీ తిరుమల రాయలకొరకు ఒకదానం చేసినట్లు చెబుతుంది. మరికొన్ని శాసనములలో ఈ తిరుమల దేవరాయలు కృష్ణదేవరాయలకున్ను, తిరుమలదేవికిన్ను కుమారుడు అని చెప్పబడెను. వీటినిబట్టి రాయలకు క్రీ.శ. 1518 లో తిరుమలరాయుడనే పుత్రుడు జన్మ్ంచినట్లు తెల్సుస్తుంది. ఈ తిరుమల రాయలు క్రీ.శ. 1524 వైశాఖమాసం నుంచి మార్గశిర మాసం వరకూ రాజ్యం చేసినట్లు శాసన ప్రమాణం ఉన్నది. ఇదే సం.లో రాయలు తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి భూదానం కూడా చేశాడు.
 
రాయలు తిమ్మరుసు కండ్లు పొడిపించి వేసినట్లు మరిఏ ఇతర ఆధారాలలోనూ కనబడదు. పూజ్యులు విజయనగర రాజ్య పరమప్రామాణికులు [[నేలటూరి వెంకటరమణయ్య]] గారు ఈ విషయాన్ని విపులంగా చర్చించారు. రాయలు క్రీ.శ.1524 లోనే కుమారుడి పట్టాభిషేకం చేయుట, ఆతడు మరణించుట ఇదే సం.లోనే జరిగినట్లు చెప్పవచ్చును. ఆమీద మూడ సం.లు అనిన్యూనిజ్ చెప్పాడు. అనగా తిమ్మరుసు క్రీ.శ. 1527-28 వరకు చెరసాలలో ఉన్నట్లు ఏర్పడుతుంది. అతని కండ్లు తీయబడుట ఆమీదనే జరుగవలెను. తిరుపతి తిరుమల శాసనములలో కొన్నొటి యందు తిమ్మరుసు ప్రశంస కలదు. ఇతడు క్రీ.శ. 1536 ఫిబ్రవరి 26న తాళ్ళపాకం తిరుమలయ్యంగారి వద్ద నుంచి 4,600 పణములు తీసికొని అందుకు బదులుగా తన తమ్ముడు గోవిందరాజుకు రావలసిన ప్రసాదంలో 1/4 వవంతును ఆయనికిచ్చి వేసినాడు. అలాగే క్రీ.శ. 1536 డిశంబరు 28తేదీనాడు తిమ్మరుసుపై తిరుమలయ్యంగారి నుంచి 1,900 పణములు తీసుకొని తన పేర శ్రీ.వేంకటేశ్వరునికి అర్పించే ప్రసాదంలో తనకు రావలసిన 1/4 వంతును ఆయనికి ఇచ్చినాడు. దీనిని బట్టి కృష్ణదేవ రాయలు తరువాత రాజ్యానికి వచ్చిన అతని సవతి తమ్ముడు అచ్యుతదేవరాయల నాటివి అని చెప్పవచ్చును. దీనిని బట్టి తిమ్మరుసు క్రీ.శ. 1536 వరకూ సజీవి అయి, దాన ధర్మాలు చేస్తున్నాట్లు స్పష్టమవుతోంది. క్రీ.శ.1541 వరకూ కూడా శాసనములలో ప్రసంసింపబడినాడు తిమ్మరుసు.
 
అందుచేత తిమ్మరుసు కళ్ళు తీయించుట గురించి న్యూనిజ్ వ్రాసిన కధనం విశ్వసనీయంగా కనబడదు.
 
క్రీ.శ.1524 లో తన కుమారుడు మరణించిన పిమ్మట తిరిగీ కృష్ణదేవ రాయలు రాజ్యత్వం చేపట్టి మరో 5 ఏళ్ళు పరిపాలన చేసాడు. అప్పుడు తిమ్మరుసు మంత్రిగా తిరిగి చేయలేదు. దీనికి ఎందుకు చేయలదనే ప్రశ్న వస్తుంది. దీనికి రాయలు స్వార్ధపరుడై తన పుత్రుడిని పట్టాభిషిక్తుని చేయదలిస్తే రాజ్యక్షేమం పురస్కరించుకొని తిమ్మరుసు రాయల ఆకోరికను ప్రతిఘటించాడనీ, అందువల్ల వారిద్దరికీ అభిప్రాయభేధాలు వచ్చిందనీ, తిమ్మరుసు తన అన్న వీరనరసింహుడి కుమారుడుని త్రోసిపుచ్చి తనని సంహాసనం ఎక్కించినట్లే తన మరణానంతరం తన కుమారుడిని కూడా తోసిపుచ్చి, తన సవతి తమ్ముడైన అచ్యుతరాయలకు పట్టం కదతాతేడొమోనని భయంవేసి తిమ్మరుసును పదభ్రష్టుని చేసాడనీ చెప్పవచ్చును.
 
==మీడియాలో==
1962 లో [[మహామంత్రి తిమ్మరుసు]] అనే సినిమా విడుదలైనది. దీనికి జాతీయ స్థాయిలో రజత పతకం లభించింది.
"https://te.wikipedia.org/wiki/తిమ్మరుసు" నుండి వెలికితీశారు