బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Tpathanjali (చర్చ | రచనలు) చిన్న సవరనలు |
Tpathanjali (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23:
ఇట్లు శ్రీనాథుఁడు పోతన ఇంటికి పోయి మిక్కిలి శిథిలమై సంకుచితమై ఉన్న ఆపూరియింటిని చూచి "బావా మహానుభావుఁడవు అగు నీవు ఈగుడిసెలో ఉండి ఈ పేదఱికమును అనుభవింపనేల ఎవరినేని గొప్ప రాజులను ఆశ్రయించి సంపదలు పడయరావా" అని పలికెను. ఇంతలో వంట అయినది స్నానమునకు యత్నము చేయుఁడు అని మల్లన వచ్చి చెప్పెను. అంత ఆయిరువురును స్నానముచేసి తమతమ అనుష్ఠానములు జరపుకొని భోజనము చేయ పోయిరి. అప్పుడు మనుష్య స్త్రీరూపము ధరియించి పోతనకు కూఁతురు అను పేర అతనియింట మెలఁగుచు ఉన్న సరస్వతీదేవి పళ్లెరమున అన్నమును కొనివచ్చి విస్తళ్లలో వడ్డించుచు కన్నుల నీళ్లు రాల్చెను. అది చూచి పోతన
"ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చెదో,
కైటభరాజుమర్దనుని గాదిలికోడల యోమదంబ యో, హాటక
గర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్ల కర్ణాట
కిరాత కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ"
|