నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
== {{anchor|2014 elections Victory}}2014 ఎన్నికలలో విజయం ==
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ''' (నవ్యాంధ్ర)''' కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారుపనిచేసాడు. 2014 జూన్‌ 8న [[గుంటూరు]] సమీపంలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref>