మోహినీ రుక్మాంగద (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==కథ==
అయోధ్యా పురాధీశ్వరుడు రుక్మాంగదుడు పరమ భక్తుడు. అతని భార్య సంధ్యావళి సంతోషం కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. ఆ ఉద్యానవన వైభవాన్ని నారదుడు దేవకన్యలకు వివరించగా వారు రోజూ రహస్యంగా రాత్రిపూట ఆ తోటలోకి వచ్చి పువ్వుల్ని కోసుకెళుతుంటారు. విదూషకుడు రాత్రి ఆ తోటకు కాపలాగా ఉన్నాడు. అయినా దేవకన్యలు అదృశ్యరూపంలో వచ్చి పూలను కోసుకు వెళతారు. చివరకు ఆ పుష్పాపహరణ చేస్తున్నదెవరో తెలుసుకునేందుకు తోటలో పుచ్చకాయ విత్తులు చల్లారు. వాటి ప్రభావం వల్ల దేవకన్యలు అదృశ్యులై తమ లోకానికి ఎగిరిపోయే శక్తిని కోల్ఫోయి పట్టుపడి పోతారు. రాణి వారిని క్షమిస్తుంది. తిరిగి వారు తమ లోకానికి ఎగిరిపోవడానికి రాజు, రాణి తమ పుణ్యాన్ని అంతా ధారపోస్తారు. అయినా ఆ పుణ్యం సరిపోలేదు. నారదుడు ఏకాదశవ్రత ప్రభావం గురించి చెప్పి ఆ వ్రతం చేసిన వారు ఎవరైనా ఉంటే వారి పుణ్యప్రభావంచే దేవకన్యలు తిరిగి దేవలోకానికి ఎగిరిపోగలరని చెబుతాడు. కోడలితో గొడవపడి ఒక పూటంతా అభోజనంగా ఉండి రాత్రంతా జాగారం చేసి ఏకాదశిని గడిపిన ఒక ముదుసలిని విదూషకుడు తీసుకుని రాగా ఆ ముసలి పుణ్యప్రభావం వల్ల దేవకన్యలు దేవలోకానికి ఎగిరిపోతారు. ఏకాదశవ్రత ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రుక్మాంగదుడు తాను ఆ వ్రతం చేయడమే కాక, ప్రజలందరూ ఆ వ్రతాన్ని ఆచరించేటట్లు చేస్తాడు. దేశం సుభిక్షమవుతుంది. రాణి మగబిడ్డను కంటుంది. తల్లిదండ్రులు ఆ బిడ్డకు ధర్మాంగదుడు అనే పేరు పెడతారు.
దేశంలోని ప్రజలందరూ ఈ వ్రతం చేయడంతో యమలోకానికి వచ్చే జనాభా తగ్గి యముడు ఖిన్నుడౌతాడు. యముడు బ్రహ్మ సహాయంతో మోహిని సృష్టించి రుక్మాంగదుని వ్రతదీక్ష నుండి మరలించమని పంపిస్తాడు. మోహిని ప్రేమలో రుక్మాంగదుడు చిక్కుకుంటాడు. మోహిని చెలికత్తె చంప విదూషకుని ఇంటిలో చిచ్చు రగులుస్తుంది. మోహినిని తన భర్త వివాహం చేసుకున్న సంగతి విని సంధ్యావళి కలవరం చెందలేదు. ఆమె, ధర్మాంగదుడు తనపట్ల చూపిన సౌజన్యానికి మోహిని ముగ్ధురాలౌతుంది. తన కర్తవ్యాన్ని మరచిపోవద్దని యముడు, బ్రహ్మ ఆమెను శాసిస్తారు. మోహిని రుక్మాంగదునితో ఏకాదశవ్రతం చేయడానికి వీలులేదంటుంది. కానీ రుక్మాంగదుడు వ్రతం మాననంటాడు. పెళ్ళి సందర్భంగా ఏది కోరినా ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమంటుంది. వ్రతం చేసే పక్షంలో పుత్రుని శిరస్సును ఖండించి తనకు సమర్పించమంటుంది. రుక్మాంగదుడు, సంధ్యావళి ఎంతో క్షోభపడతారు. చివరకు రుక్మాంగదుడు ధర్మాంగదుడి తలను నరకడానికి సిద్ధమవుతాడు. రుక్మాంగదుని చేతిలోని కత్తి పూలదండగా మారిపోతుంది. మహావిష్ణువు ప్రత్యక్షమౌతాడు. యముడు తన ఓటమిని అంగీకరిస్తాడు. కథ సుఖాంతమౌతుంది<ref>{{cite news |last1=సంపాదకుడు |title=చిత్ర సమీక్ష - మోహినీరుక్మాంగద |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=46040 |accessdate=18 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=21 January 1962}}</ref>.
 
==పాటలు, పద్యాలు==