గాలిమేడలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
* శబ్దగ్రహణం: పి.వి.కోటేశ్వరరావు
==కథ==
ఒకానొక గ్రామంలో రంగనాథం, పానకాలస్వామి అనే మిత్రద్వయం ఉంటుంది. రంగనాథం క్షయవ్యాధితో బాధపడుతుంటాడు. చికిత్సకై ఆసుపత్రిలో చేరుతూ తల్లిలేని తన కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాణ్ణి చేయవలసిందిగా కోరుతాడు. అందుకోసం పదివేల రూపాయలు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని చౌకగా భూములు కొనుక్కుని వ్యవసాయం చేయాలనే ఆశతో పానకాల స్వామి రంగూన్ వెడుతున్నానని ఓ పెద్ద్ అబద్ధంచెప్పి తెలంగాణాకు పోయి కొంత భూమి కొని కొంత కౌలుకు తీసుకొంటాడు. పెద్ద మోతుబరి రైతు అవుతాడు పానకాలస్వామి. సంతానం లేని పానకాలస్వామికి ఓ పిల్లవాడు కూడా జన్మించాడు. తాను పెంచిన కృష్ణుణ్ణి వ్యవసాయంలో పెట్టి కన్నకొడుకు మోహన్‌ను హైదరాబాదులో చదువు చెప్పిస్తూ వచ్చాడు. చదువు సంధ్యలు లేకున్నా కృష్ణుడు బుద్ధిమంతుడు. చదువుకుంటున్న మోహన్ తాను లక్షాధికారిఅని నాటకమాడి ఓ జమీందారు కుమార్తె నిర్మలను వలలో వేసుకుంటాడు. గ్రామంలో నాగన్న అనే రైతు తన కూతురు లక్ష్మిని మోహన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దానికేం భాగ్యమని పానకాలస్వామి నాగన్న దగ్గర మోహన్ చదువుకోసమని రెండువేలు గుంజుతాడు. అయితే లక్ష్మి కృష్ణులు అంతకు ముందే ప్రేమించుకున్న సంగతి తెలిసిన పానకాలస్వామి కృష్ణుడిని ఇంటినుండి వెళ్ళగొడతాడు. అదే సమయంలో జమీందారు కుమార్తెతో ఆ గ్రామానికి భూముల వ్యవహారాలు చూసుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో వారితో పాటు మోహన్ కూడా ఉండడం చూసి, మోహన్ వేసిన ఎత్తుగడకు ఆనందించిన పానకాలస్వామి నాగన్న బెడద వదిలించుకునేందుకు పథకం వేస్తాడు. కృష్ణుని అన్వేషణకై లక్ష్మిని హైదరాబాదుకు పంపిస్తాడు. జమీందారు ఆస్తినంతా కాజేయాలనే ఆశతో తన ఆస్తిని అరవై వేలకు అమ్మివేసి ఆడబ్బును ఖర్చుపెట్టి నిమ్మి,మోహన్‌ల పెళ్లి జరిపిస్తాడు. కుమార్తె లక్ష్మిని వెదుకుకుంటూ వచ్చిన నాగన్న మోహన్ ఎవరైనదీ జమీందారుకు వెల్లడిస్తాడు. జమీందారు ఆగ్రహోదగ్రుడై పానకాల స్వామిని, ఆయన భార్య శాంతమ్మను ఇంటినుండి వెళ్ళగొట్టి త్రోసివేస్తాడు. ఆ ఘర్షణలో పానకాలస్వామి మేడమీద నుండి క్రిందపడి కాలువిరుగ కొట్టుకుంటాడు. ఆస్తి అంతా పోయి బూట్ పాలిషింగ్ వృత్తిగా చేసుకుంటాడు. ఆసుపత్రిలో రోగ విముక్తి పొంది వచ్చిన రంగనాథం పానకాలస్వామి రంగూన్ వెళ్ళినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్ళి వ్యాపారంలో లక్షలు గడించి తిరిగి స్వదేశానికి వచ్చి హైదరాబాదులో స్థిరపడతాడు. ఒక సందర్భంలో కృష్ణుని మంచితనాన్ని గ్రహించి తనకు నౌకరుగా పెట్టుకుంటాడు. కన్నకొడుకుని పోగొట్టుకొన్న విచారం తగ్గటం కోసం ఒక అనాథశరణాలయాన్ని కట్టించడంలో రంగనాథం కృష్ణున్నే మేస్త్రీగా నియమిస్తాడు. అక్కడికే పనికోసం వచ్చిన శాంతమ్మను కృష్ణుడు గుర్తిస్తాడు. రంగనాథం సంగతి తెలుసుకున్న మోహన్ తనే అతని కొడుకు అని నాటకమాడబోతాడు. రంగనాథం ఇంటికి వస్తాడు. కృష్ణుడు ఇక మోహన్ దౌష్ట్యం సహించలేక అక్కడి నుండి వెళ్ళిపొమ్మని హెచ్చరిస్తాడు. తెల్లవారగానే వెళ్లిపోతానని చెప్పిన మోహన్ రంగనాథం డబ్బును ఎత్తుకుపోవడానికి చేసిన ప్రయత్నం తుది క్షణంలో రంగనాథం మేలుకోవడంతో విఫలమౌతుంది. కృష్ణుడు మోహన్ కలబడి కొట్టుకొంటున్న సమయంలో శాంతమ్మ, పానకాలస్వామి, లక్ష్మి అక్కడకు రావడంతో రంగనాథం కృష్ణుడు తన కొడుకే అని గ్రహిస్తాడు. లక్ష్మి కృష్ణుల పెళ్లితో కథ సుఖాంతమవుతుంది<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=గాలిమేడలు చిత్రసమీక్ష |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=46057 |accessdate=20 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=18 February 1962}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు" నుండి వెలికితీశారు