మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 18:
మీరాబాయి 1498లో [[రాజస్థాన్]], [[జోధ్పూర్ జిల్లా]], కుర్కి గ్రామంలోని రాజ్పుత్ రాజ కుటుంబంలో జన్మించింది. మీరా గురించి ప్రామాణికమైన రికార్డులు అందుబాటులో లేవు. లభించిన ఆధారాలతో చరిత్రకారులు మీరా జీవిత చరిత్రను రాశారు. 1516లో మీరాకు ఇష్టంలేకుండా [[మేవాడ్]] యువరాజు భోజ్రాజ్తో వివాహం జరిగింది.<ref name=usha13>Usha Nilsson (1997), Mira bai, Sahitya Akademi, {{ISBN|978-8126004119}}, pages 12-13</ref><ref>Nancy Martin-Kershaw (2014), Faces of the Feminine in Ancient, Medieval, and Modern India (Editor: Mandakranta Bose), Oxford University Press, {{ISBN|978-0195352771}}, page 165</ref> 1518లో ఢిల్లీ సుల్తానేట్లో జరుగుతున్న హిందూ-ముస్లిం యుద్ధంలో గాయాలతో బయటపడిన మీరాబాయి భర్త భోజ్రాజ్ 1521లో జరిగిన యుద్ధంలో మరణించాడు. భారత ఉపఖండంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించిన [[బాబర్]] కు చెందిన ఇస్లామిక్ సైన్యంతో జరిగిన యుద్ధంలో మీరాబాయి భర్త భోజ్రాజ్,<ref name=ushamiralife/> తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె తండ్రి, ఆమె బావ ఇద్దరూ చంపబడ్డారు.<ref name=kinsley>David Kinsley (1997), Tradition and Modernity in Bhakti Movements (Editor: J Lele), Brill Academic, {{ISBN|978-9004063709}}, pages 88-89</ref><ref>SR Bakshi (2002), Mirabai: Saints of India, Criterion, {{ISBN|978-8179380239}}, pages 42-45, 282-283</ref>
మీరాబాయి బావ మరణం తరువాత మేవాడ్కు విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తమామలు ఆమెను చంపడంకోసం చాలాసార్లు ఉరితీయడానికి ప్రయత్నించారని, మీరాకు ఒక గ్లాసు విషం, పువ్వులకు బదులుగా పాముతో ఉన్న బుట్టను పంపించారని చరిత్రకారులు తమ పరిశోధనలో పేర్కొన్నారు.<ref name=brit1/><ref name=usha13/> పాము కృష్ణ విగ్రహం (పువ్వుల దండ)గా మారడంతో ఆమెకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హాజియోగ్రాఫిక్ ఇతిహాసాలలో చెప్పబడింది.<ref name=nancy/><ref name=usha13/>తనను తాను మునిగిపోమని విక్రమ్ సింగ్ కోరగా మీరాబాయి నీటిలో మునగగా, ఆమె నీటిలో మనగకుండా పైకి తేలిందని మరికొన్ని ఇతిహాసాలలో రాయబడింది.<ref name=usha17>Usha Nilsson (1997), Mira bai, Sahitya Akademi, {{ISBN|978-8126004119}}, pages 16-17</ref> మొఘల్ చక్రవర్తి [[అక్బర్]], మీరాబాయిని చూడడానికి [[తాన్సేన్]] తో వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారాన్ని సమర్పించాడని మరొక చోట రాయబడింది. ఇది నిజంగా జరిగిందా లేదా అన్నదానిపై పరిశోధకులకు అనుమానాలు ఉన్నయి. ఎంటుకంటే, మీరాబాయి మరణించిన 15 సంవత్సరాల తరువాత, అనగా 1562లో అక్బర్ కోర్టులో తాన్సేన్ చేరాడు.<ref name=usha17/> అదేవిధంగా, కొన్నింటిలో గురు రవిదాస్ మీరాబాయి గురువు అని రాసివుంది, అయితే దీనిని ధృవీకరించే చారిత్రక ఆధారాలు లేవు. ఈ విషయం ఇతరులు అంగీకరించలేదు.<ref name=usha17/>
== రచనలు ==
|