మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
మీరాబాయి బావ మరణం తరువాత మేవాడ్‌కు విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తమామలు ఆమెను చంపడంకోసం చాలాసార్లు ఉరితీయడానికి ప్రయత్నించారని, మీరాకు ఒక గ్లాసు విషం, పువ్వులకు బదులుగా పాముతో ఉన్న బుట్టను పంపించారని చరిత్రకారులు తమ పరిశోధనలో పేర్కొన్నారు.<ref name=brit1/><ref name=usha13/> పాము కృష్ణ విగ్రహం (పువ్వుల దండ)గా మారడంతో ఆమెకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హాజియోగ్రాఫిక్ ఇతిహాసాలలో చెప్పబడింది.<ref name=nancy/><ref name=usha13/>తనను తాను మునిగిపోమని విక్రమ్ సింగ్ కోరగా మీరాబాయి నీటిలో మునగగా, ఆమె నీటిలో మనగకుండా పైకి తేలిందని మరికొన్ని ఇతిహాసాలలో రాయబడింది.<ref name=usha17>Usha Nilsson (1997), Mira bai, Sahitya Akademi, {{ISBN|978-8126004119}}, pages 16-17</ref> మొఘల్ చక్రవర్తి [[అక్బర్]], మీరాబాయిని చూడడానికి [[తాన్‌సేన్]] తో వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారాన్ని సమర్పించాడని మరొక చోట రాయబడింది. ఇది నిజంగా జరిగిందా లేదా అన్నదానిపై పరిశోధకులకు అనుమానాలు ఉన్నయి. ఎంటుకంటే, మీరాబాయి మరణించిన 15 సంవత్సరాల తరువాత, అనగా 1562లో అక్బర్ కోర్టులో తాన్‌సేన్ చేరాడు.<ref name=usha17/> అదేవిధంగా, కొన్నింటిలో గురు రవిదాస్ మీరాబాయి గురువు అని రాసివుంది, అయితే దీనిని ధృవీకరించే చారిత్రక ఆధారాలు లేవు. ఈ విషయం ఇతరులు అంగీకరించలేదు.<ref name=usha17/>
 
మీరాబాయి గురించి ప్రస్తావించిన మూడు వేర్వేరు పురాతన రికార్డులు అన్నీ 17వ శతాబ్దం నుండి (మీరాబాయి మరణించిన 150 సంవత్సరాలలో) వ్రాయబడ్డాయి.<ref>These are Munhata Nainsi's Khyat from [[Jodhpur]], Prem Ambodh from [[Amritsar]] and Nabhadas's Chappay from [[Varanasi]]; see: JS Hawley and GS Mann (2014), Culture and Circulation: Literature in Motion in Early Modern India (Editors: Thomas De Bruijn and Allison Busch), Brill Academic, {{ISBN|978-9004264472}}, pages 131-135</ref> వాటిల్లో ఆమె బాల్యం గురించి లేదా భోజరాజ్‌తో ఆమె వివాహం చేసుకున్న పరిస్థితుల గురించి ఏమీ ప్రస్తావించబడలేదు. ఆమెను హింసించిన వ్యక్తులు ఆమె అత్తమామలు లేదా కొంతమంది రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందినవారని కూడా పేర్కొనబడలేదు.<ref>JS Hawley and GS Mann (2014), Culture and Circulation: Literature in Motion in Early Modern India (Editors: Thomas De Bruijn and Allison Busch), Brill Academic, {{ISBN|978-9004264472}}, pages 131-135</ref> మీరాను హింసించడానికి మతపరమైన లేదా సామాజిక సంప్రదాయాలు కారణమయ్యే అవకాశం లేదని, రాజ్‌పుట్ రాజ్యం - మొఘల్ సామ్రాజ్యాల మధ్య సైనిక ఘర్షణ దీనికి కారణం కావచ్చని నాన్సీ మార్టిన్-కెర్షా పేర్కొన్నాడు.
 
మీరాబాయి మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిందని ఇతర కథలలో చెప్పబడింది. తన చివరి రోజుల్లో, మీరాబాయి [[ద్వారక]] (బృందావన్) నివసించిందని, అక్కడ 1547లో కృష్ణుడి విగ్రహంలోకి ప్రవేశంచడం ద్వారా ఆమె అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి.<ref name=ushamiralife/><ref name=brit1/> మీరా తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి, భక్తి గీతాలను రూపొందించి, వాటిని గానం చేసినందువల్ల మీరాబాయి భక్తిమార్గంలో నడిచిన కవయిత్రిగా అంగీకరించారు.<ref name=brit1/><ref name=usha17/><ref>John S Hawley (2005), Three Bhakti Voices: Mirabai, Surdas and Kabir in Their Times and Ours, Oxford University Press, {{ISBN|978-0195670851}}, pages 128-130</ref>
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు