దక్షయజ్ఞం (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
==కథ==
దక్షప్రజాపతి బ్రహ్మపుత్రుడు. తన సృజనాత్మక శక్తిచే చతుర్దశ భువనాలమీద అధికారాన్ని పొందగలిగాడు. శంకరుని భక్తుడైన దక్షుడు ఆదిశక్తిని తన కూతురుగా పొందగలిగాడు. ఆమెయే సతీదేవి. సతీదేవి బాల్యం నుండి శంకరుని ప్రేమించి అతడినే భర్తగా భావించసాగింది. అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్ర బాలలు దక్షుని దత్తపుత్రికలు. వీరి వివాహాన్ని చూడవచ్చిన సందర్భంలో సతీదేవి శంకరునికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆమెను తప్పకుండా సతిగా స్వీకరిస్తానని శివుడు మాట ఇస్తాడు.
 
మిగిలిన నక్షత్రకాంతలను ఆదరించక చంద్రుడు రోహిణీలోలుడై కాలం గడపటంతో తమకు అన్యాయం జరిగిందని వారంతా దక్షునికి చెబుతారు. దక్షుడు కోపించగా ఆయన భార్య వైరిణి సామరస్యంగా వారి కాపురాలను చక్కదిద్దమని కోరింది. భార్యలనందరినీ సమాన ప్రేమతో చూడమని దక్షుడు చంద్రునికి సలహా ఇవ్వగా, ఇది నా స్వంత వ్యవహారం నీ జోక్యం అక్కరలేదని చంద్రుడు దక్షునికి కటువుగా సమాధానం చెబుతాడు. దానికి కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుని క్షయ గ్రస్తుడు కమ్మని శాపం ఇస్తాడు. చంద్రుడు శివుని శరణు కోరతాడు. శివుడు చంద్రునికి అభయమిస్తాడు. నారదుని ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దక్షుడు కోపావేశంతో శివుని వద్దకు వచ్చి వాదనకు దిగుతాడు. ఇరువురూ కోపంతా ఆయుధాలు తీస్తారు. విష్ణువు వచ్చి వారిద్దరికీ రాజీ కుదురుస్తాడు. ఫలితంగా చంద్రునకు వృద్ధి క్షయాలు (కృష్ణ శుక్ల పక్షాలు) సంభవించాయి. శివుడు చంద్రశేఖరుడైనాడు.
 
==పాటలు==