అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం
చి →‎వేంకటాద్రి నాయుడు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 25:
==వేంకటాద్రి నాయుడు==
{{ముఖ్య వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
వేంకటాద్రి రాజధానిని [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డుననున్న గుంటూరు మండలంలోని [[అమరావతి]]/[[ధరణికోట]]కు మార్చాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు, మంచి పరిపాలనాదక్షుడు. [[కృష్ణా డెల్టా]] ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును [[జగ్గయ్యపేట]]గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగస్టు 17న మరణించాడు<ref>{{Cite book |title=శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు|author=కొడాలి లక్ష్మీనారాయణ|year=1963|location=పొన్నూరు|url=https://archive.org/details/rajavasireddyven022548mbp|publisher=శ్రీ భావనారాయణస్వామివారి దేవస్థానము}}</ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు